Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?
- By Sudheer Published Date - 12:01 PM, Mon - 8 January 24
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి (TDP) ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
తాజాగా పశ్చిమగోదావరి (West Godavari) , ఎన్టీఆర్ (NTR Dist) జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు (TDP Fans), జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల (NTR Fans) మధ్య జరిగిన గొడవ, కర్రలతో దాడి (Fight ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. గత కొంతకాలంగా టిడిపి తో పాటు చంద్రబాబు బాలకృష్ణులతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. కేవలం సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారు తప్ప రాజకీయాల వైపు చూడడం లేదు. అంతెందుకు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యావత్ తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ నిరసనలు, ఆందోళన చేస్తూ రోడ్డు ఎక్కారు. అలాగే సినీ ప్రముఖులు రాజకీయతర పార్టీల నేతలు సైతం చంద్రబాబుకు సపోర్టుగా నిలిచారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం చంద్రబాబు అరెస్టు విషయంలో ఏమాత్రం స్పందించలేదు. అప్పటికే ఎన్టీఆర్ పై ఆగ్రహం తో ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కూడా స్పందించకపోయేసరికి మరింత ఆగ్రహం పెంచుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అప్పటినుండి ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు సైతం టిడిపికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు సపోర్ట్ ఇస్తూ వారు పోస్టులు పెడుతున్నారు. ఇలా ఇరువురు పోస్టులు, కామెంట్స్, వ్యతిరేక విమర్శలు చేస్తూ వార్ కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆరే భవిష్యత్ సీఎం అంటూ పోస్టర్లు పెట్టి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు ఒంగోలులో అయితే ఈ ఏకంగా కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కట్టే మరింతగా రెచ్చగొట్టారు. ఇలా కొద్ది రోజులుగా పోస్టర్లు ఫ్లెక్సీలు పెడుతూ టిడిపి శ్రేణులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జూనియర్ ఎన్టీఆర్ – టీడీపీ అభిమానుల మధ్య కొట్లాట జరిగింది. కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లకార్డు లను పట్టుకొని టీడీపీ సభకు వచ్చి..చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టిడిపి శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడడం చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకొని వచ్చిన వారిని సభ నుండి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట కొట్లాట జరిగింది. అయితే ఇదంతా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారా లేక వైసీపీ కావాలని ఇలా ఎన్టీఆర్ పేరుతో గొడవలు సృష్టిస్తుందా అనేది ఎవరికి అర్థం కావడం లేదు.
దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని..ఒకవేళ అభిమానులు ఇలాగే చేసినట్లయితే వారికీ నచ్చచెప్పడం వంటిది చేయాలనీ..లేదంటే ఎన్టీఆర్ పేరు చెప్పి ఇంకెన్నో దాడులకు పాల్పడతారని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఇప్పటికేగా స్పందించి రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూస్తున్నారో చూడాలి.
Read Also :
Related News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.