Nellore TDP Janasena Meeting : నెల్లూరులో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం.. రెండు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ వైసీపీపై ఫైర్..
తాజాగా నెల్లూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు టీడీపీ, జనసేన నేతల ఆత్మీయ సమావేశం జరిగింది.
- By News Desk Published Date - 07:56 PM, Wed - 27 September 23
చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అంశం ఏపీ రాజకీయాలని మార్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైలులో చంద్రబాబుని కలిసిన అనంతరం టీడీపీతో(TDP) కలిసి పోటీ చేయబోతున్నాం వచ్చే ఎన్నికల్లో అంటూ ప్రకటించాడు. దీంతో అధికారికంగా జనసేన – టీడీపీ పొత్తు ఖరారైంది.
పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకి కూడా టీడీపీతో మంచిగా వ్యవహరించాలని సూచనలు కూడా చేశాడు. వీరు పొత్తు ప్రకటించిన దగ్గర్నుంచి వైసీపీ నాయకులు రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి రెండు పార్టీలపై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా టీడీపీ జనసేన పొత్తుపై బాగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు టీడీపీ, జనసేన నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన ప్రముఖ నాయకులు వచ్చారు.(Nellore TDP Janasena Meeting)
టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం అనంతరం టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయ బద్దంగా జనసేన నేతలను కలసి పోరాటం చేసేందుకు ముందుకు వెళ్తున్నాం. జిల్లా స్థాయిలోనే కాదు, మండల గ్రామ స్థాయిలో మంచి సoకేతాలు ఇచ్చేందుకే మా కలయిక. ఈ రాష్ట్రంలో అధికార అహంకారంతో క్రిమినల్ బేస్ ప్రభుత్వం నడుస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులు, వేధింపులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే జనసేన, టీడీపీ కలయిక. ఇవాళ కలసిన ఈ కలయిక రాజ్యాంగాన్ని నిలబెట్టేంత వరకు కలసి పని చేస్తాం అని వ్యాఖ్యానించారు.
నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్ది మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కలిసి పోరాడుతాం. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండిస్తున్నాం. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్ది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించారు. వై నాట్ 175 నుండి నో మోర్ జగన్మోహన్ రెడ్ది అంటున్నారు ప్రజలు.
ప్రజలు జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు అని అన్నారు.
ఇక టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు లక్షల కోట్లు అవినీతి అని చెప్పి చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారు. జైల్లో చంద్రబాబును కలసి పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మా పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రేపు వామపక్షలు, బీజేపీని కలుస్తాం. ప్రజాస్వామ్యం కాపాడేందుకు కలసి పోరాడుతాం. నియంత పాలనకు బుద్ది చెప్పేంత వరకు పోరాడుతాం అని అన్నారు. ఈ మీటింగ్ పై నెల్లూరు వైసీపీ నాయకులు ఏమంటారో చూడాలి.
Also Read : CBN Jail Effect In Telangana : చంద్రబాబు జైలుపై ఒకే పంథాలో రేవంత్ , కేటీఆర్
Tags
Related News
Vallabhaneni Vamsi : వంశీ తన ఓటమిని ముందుగానే గ్రహించాడా..?
ఏపీ రాజకీయాలు అంటే గుర్తుకు వచ్చేవి వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఈ సారి టీడీపీ కూటమి గెలిపించేందుకు ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రావాసులు తమ సొంతూళ్లకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.