Nellore TDP : నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జ్గా పొంగూరు నారాయణ
ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో
- By Prasad Published Date - 10:58 PM, Thu - 29 June 23
ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇంఛార్జ్లను నియమించింది. తాజగా నెల్లూరు సిటీ ఇంఛార్జ్గా మాజీ మంత్రి నారాయణను నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారాయణ.. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆయన బీజేపీకి వెళ్తారంటూ కొద్దికాలంపాటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయనున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేరికతో నారాయణ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. వీరి మద్దతుతో ఈ సారి నెల్లూరు సిటీలో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అధినేత చంద్రబాబు భావించారు. అందుకే మళ్లీ నారాయణకు నెల్లూరు సిటీ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Related News
AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..
ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది