Yuvagalam : నారా లోకేష్ తో పాదయాత్ర చేసిన నందమూరి కుటుంబ సభ్యులు
- By Sudheer Published Date - 01:44 PM, Mon - 18 December 23
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో చివరి రోజున లోకేష్ తో కలిసి నందమూరి కుటుంబ సభ్యులు (Nandhamuri Family) కూడా పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు. ఈరోజు విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పూర్తి అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా గాజువాక నియోజకవర్గం సీడబ్ల్యూసీ-1 నుంచి పండుగ వాతావరణం నెలకొంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నారా వారి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని లోకేష్ తో కలిసి అడుగులేశారు. ఇలా ఇరు కుటుంబ సభ్యులు కలిసి యాత్ర లో పాల్గొనడం తో కార్యకర్తల్లో , అభిమానుల్లో సంతోషం అంబరాన్ని తాకింది. లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు విషయంలో తండ్రి చంద్రబాబు (Chandrababu) సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. గతంలో చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను ఉమ్మడి విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగించారు. అదే రీతిలో నేడు నారా లోకేశ్ సైతం ఆగనంపూడి వద్దనే పాదయాత్రను ముగిస్తున్నారు. చంద్రబాబు ఇదే సెంటిమెంట్తో అధికారంలోకి రావడంతో అదేసెంటిమెంట్ను నారా లోకేశ్ సైతం ఫాలో అవుతున్నారు.
ఇక ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండంలలోని పోలిపల్లి వద్ద యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ ముగింపు సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతోపాటు, అతిరథ మహారథులు సైతం హాజరుకానున్నారు.
Read Also : Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?
Related News
Chandrababu : వాలంటీర్లు లేకుండా పెన్షన్లు సాధ్యమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ కుట్రల్లో అధికారులు కూడా పాలుపంచుకోవడం విచారకరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.