Anantha Bhaskar Issue : హంతకుడి అరెస్ట్ పై నాన్చుడు
డ్రైవర్ సుబ్రమణ్యం హ్యత కేసు రాజకీయాన్ని వేడెక్కించింది. హంతకుడు అనంత్ బాబును రక్షించడానికి వైసీపీ అగ్రనేతలు ప్రయత్నించారని టీడీపీ చేస్తోన్నన ఆరోపణ.
- By CS Rao Published Date - 05:03 PM, Mon - 23 May 22
డ్రైవర్ సుబ్రమణ్యం హ్యత కేసు రాజకీయాన్ని వేడెక్కించింది. హంతకుడు అనంత్ బాబును రక్షించడానికి వైసీపీ అగ్రనేతలు ప్రయత్నించారని టీడీపీ చేస్తోన్నన ఆరోపణ. అందుకు తగిన విధంగా పోలీసులు చర్యలు ఉన్నాయి. సంఘటన జరిగిన తరువాత ఆలస్యంగా పోలీసులు స్పందించారు. పోస్ట్ మార్టం విషయంలోనూ గందరగోళం రేగింది. ఆ టైంలో దళిత సంఘాలు, టీడీపీ రంగంలోకి దిగింది. దీంతో అనివార్యంగా హంతకుడు అనంత్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యంను చంపేశానని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకోవడంతో ఏపీలోని నేరాల చిట్టాను టీడీపీ విప్పుతోంది.
కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ చేసిన 72 గంటలు తరువాత కూడా ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెరవెనుక పాత్రను అనుమానించారు. డ్రైవర్ ను హత్య చేసిన తరువాత ఎమ్మెల్సీ అనంత్ తప్పించుకోవడానికి ద్వారంపూడి, సజ్జలను కలిశారని ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 1 కోటి పరిహారాన్ని చెల్లాంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఇంత వరకు పరామర్శించలేదని దుయ్యబట్టారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంత బాబు వద్ద పనిచేసే ఇద్దరు గన్మెన్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో మొదట సుబ్రహ్మణ్యంది అనుమానా స్పద మరణంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, భావోద్వేగాల మధ్య కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సుబ్రహ్మణ్యంది సాధారణ మరణం కాదని, హత్య అని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో హత్య కేసుగా మార్చారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ను ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసింది ఎమ్మెల్సీ ఉదయభాస్కరే అని అతడి కుటుంబ సభ్యులతో పాటు ఎస్సీ, ప్రజాపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చాక హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తామని సెక్షన 302 కింద హత్య కేసుగా మారుస్తున్నట్టు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు ఆయన వద్ద పనిచేసే ఇద్దరు గన్మెన్లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
పోలీస్ విచారణ ఆలస్యం
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోస్టుమార్టం జరపడం ఆలస్యం కావడంతో తాము విచారణ ఆలస్యంగా ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తన కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్బాడీని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు నాలుగు రోజుల కిందట అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పిన ఎమ్మెల్సీ, తాము అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక అక్కడినుంచి వేరే కారులో వెళ్లిపోయాడని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ను అరెస్ట్ చేస్తేగానీ సుబ్రహ్మణ్యానికి పోస్టుమార్టం చేయడానికి లేదని కుటుంబసభ్యులు పట్టుపట్టారు. దీంతో దాదాపు రెండు రోజుల తరువాత పోస్టుమార్టం నిర్వహించారు.
పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయాలతో ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కానీ అనంత ఉదయ భాస్కర్ ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. పుట్టినరోజు నాడు ఆయనతో పాటు ఉన్న గన్మెన్లు, సిబ్బంది సైతం ఎమ్మెల్సీ ఆచూకీ తెలియదని చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో వైసీపీ నేత ఇంటి వద్ద శనివారం గడిపిన ఎమ్మెల్సీ, ఆ తర్వాత మరో ప్రాంతానికి వెళ్లారని సమాచారం. కాకినాడలోనూ కనిపించారని సమాచారం అందడంతో అక్కడ సైతం వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్సీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.
Related News
MLC Anantha Babu : ‘అనంత’ క్రైమ్ థ్రిల్లర్ `కథ`!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా జ్యోతుల నెహ్రూ మేనల్లుడు. ఆయనది కాపు సామాజిక వర్గం.