MVV Satyanarayana : ఇంటికొచ్చి కొడతా.. జనసేన నేతకు వైసీపీ ఎంపీ వార్నింగ్
- By Kavya Krishna Published Date - 11:33 AM, Fri - 16 February 24
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. నిన్న విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్సీపీ (YSRCP) తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ (Janasena Party) (జేఎస్పీ) పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamshikrishna Srinivas) అన్నారు. గురువారం విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి మీడియాతో మాట్లాడిన వంశీకృష్ణ తదుపరి ప్రభుత్వాన్ని జేఎస్పీ-టీడీపీ కూటమి ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సత్యనారాయణకు ఓటు వేయవద్దని జేఎస్పీ అధ్యక్షుడు కె.పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వి.రామకృష్ణబాబు అభిమానులకు ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపి ఆక్రమిత భూముల వివరాలను తెరపైకి తెస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్రెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకే తాను వైఎస్సార్సీపీని వీడానని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఎంపీ తనపై పర్సనల్ వ్యాఖ్యలు చేస్తే.. బాధితుల జాబితా మొత్తం తన వద్ద ఉన్నందున ఎంపీ అక్రమాస్తులను బయటపెడతానని ఎమ్మెల్సీ హెచ్చరించారు. కాగా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణబాబుతో కలిసి పనిచేయడం పట్ల ఎమ్మెల్సీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేపై పోటీ చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో రామకృష్ణబాబు విజయం సాధించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో.. తనపై తీవ్ర విమర్శలు చేసిన జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు ఎంవీవీ సత్యనారాయణ. ఎంవీపీ పోలీస్టేషన్లో తన పరువుకు వంశీ భంగం కలిగించారని ఈ మేరకు ఫిర్యాదు చేశారు ఎంవీవీ సత్యనారాయణ. తప్పుడు ఆరోపణలు, అనవసర విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also : Farmers Protest:రైతు సంఘాలతో కేంద్రం చర్చలు అసంపూర్ణం.. 18న మరోసారి భేటీ
Related News
LS Polls : ఓటు వేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టిన బీజేపీ నేత కుమారుడు..!
ప్రస్తుతం దేశంలో దశలవారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.