CBI : వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శనివారం) హైదరాబాద్లోని
- By Prasad Published Date - 08:23 AM, Sat - 28 January 23
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శనివారం) హైదరాబాద్లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎదుట హాజరుకానున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఎంపీకి నోటీసులు జారీ చేస్తూ హైదరాబాద్ జోన్కు చెందిన సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తన స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు జనవరి 24న తమ ఎదుట హాజరుకావాలన్నారు. అయితే తనకు జనవరి 23న నోటీసు అందినందున కొంత సమయం ఇవ్వాలని తాను పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారం అందించారు. అవినాష్ రెడ్డి అభ్యర్థన మేరకు జనవరి 28న హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరుతూ ఏజెన్సీ మళ్లీ నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ రోజు (శనివారం) సీబీఐ ముందు మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకానున్నారు.
Related News
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.