Suparipalanalo Toli Adugu : గెలిచింది కూటమి కాదు ప్రజలు – నారా లోకేష్
Suparipalanalo Toli Adugu : జూన్ 4నాటి ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని, ప్రజలు తామే నిజమైన గెలుపొందినవారని ఆయన స్పష్టం చేశారు
- Author : Sudheer
Date : 23-06-2025 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” (Suparipalanalo Toli Adugu) పేరిట అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడారు. జూన్ 4నాటి ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని, ప్రజలు తామే నిజమైన గెలుపొందినవారని ఆయన స్పష్టం చేశారు. 175 స్థానాల్లో 164 గెలిచిన ఘనత ప్రజలదేనని, వారు చరిత్రను తిరగరాశారని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
Country: జలవాయు మార్పుల కారణంగా మునిగిపోయే స్థితిలో ప్రముఖ దేశం?!
గత ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంస పాలన ముంచెత్తిందని, ప్రజల స్వేచ్ఛలపై దాడులు జరిగిన రోజులు మరిచిపోలేమని లోకేశ్ విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల మొఖంలో చిరునవ్వు కనిపించిందని, ప్రశాంత జీవితం కుదిరిందని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో పింఛన్లు పెంపు, తల్లికి వందనం, ఉచిత ఇసుక పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 16,000పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు, మద్దతు ధరల అమలు వంటి పథకాలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నామని చెప్పారు.
విద్యా రంగంలో రాజకీయాల ముసుగును తొలగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు. డిన్నర్ షెడ్యూల్, ఫోటో రాజకీయం తొలగించి విద్యార్థుల హక్కులకు గౌరవం కల్పిస్తున్నామని అన్నారు. వన్ క్లాస్ వన్ టీచర్ మాదిరిగా 9,800 పాఠశాలల్లో నూతన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉద్యోగస్తులు ప్రభుత్వానికి శక్తివంతమైన శక్తి అని కొనియాడారు. వారి కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పారు. గత పాలకుల అరాచక పాలనతో 151 స్థానాలు 11కి తగ్గిపోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు పాలకులందరూ ప్రజల కోసం వినయంగా పని చేయాలని, అధికారులూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. “ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే స్వర్ణాంధ్ర సాధ్యమే” అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.