HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Law And Order Has Deteriorated In Ap Presidents Rule Should Be Imposed Immediately Jagan

YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్‌

రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్‌ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.

  • By Latha Suma Published Date - 07:09 PM, Fri - 4 July 25
  • daily-hunt
Law and order has deteriorated in AP..President's rule should be imposed immediately: Jagan
Law and order has deteriorated in AP..President's rule should be imposed immediately: Jagan

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నేటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్‌ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు. రెడ్‌బుక్ లాంటి విధానాలతో, రాజకీయ పగలతో ముదిరిన దుర్మార్గపు చర్యలతో రాష్ట్రం రక్తమోడుతోంది. శాంతిని భంగం చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తుండటం విచారకరం.

Read Also: Ukraine- Russia: ఉక్రెయిన్‌పై ర‌ష్యా భారీ దాడి.. ఏకంగా 550 దాడులు!

అది సాధ్యం కాకపోతే, ప్రత్యక్ష దాడులకు పాల్పడేందుకు టీడీపీకి చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావుపై దాడి ఉదాహరణగా చూపుతూ జగన్ పట్టపగలు ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం, ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా పాలన సాగుతుందో స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా పాలనకు నిదర్శనం అని తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం వైసీపీలో చురుకుగా పాల్గొంటూ, ప్రజల్లో గౌరవాన్ని సంపాదించిందని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా తన అనుచరులను పురిగొల్పి ఈ దాడులకు తెగబడ్డారు.

ఇది ఒక తాలూకు రాజకీయ కుట్ర. గందరగోళం సృష్టించి ప్రజల మద్దతు కోల్పోతున్న టీడీపీ, ఇప్పుడు భయపడతూ అరాచకాలకు పాల్పడుతోంది అని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ దాడులను ప్రోత్సహిస్తూ, గ్యాంగ్‌లీడర్‌లా వ్యవహరిస్తున్నారు. వరుస దాడులు, వేధింపుల నేపథ్యంలో, ఈ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు. మాఫియా తరహాలో పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేందుకు అర్హత లేదు. చట్టాన్ని అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదని నేను ప్రశ్నిస్తున్నాను అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్రం నిద్రలేచి స్పందించాలనీ, రాష్ట్రంలోని ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

Read Also: Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • law and order
  • Peace and Security
  • President Rule
  • Redbook
  • tdp
  • ys jagan

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

  • Ys Jagan

    YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!

  • Sharmila

    Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd