Lakshmi Parvathi : ఎన్టీఆర్ పేరు మార్పుపై నోరువిప్పిన లక్ష్మీపార్వతి
ఎట్టకేలకు వారం తరువాత హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడంపై లక్ష్మీపార్వతి నోరువిప్పారు.
- By CS Rao Published Date - 02:20 PM, Mon - 26 September 22
ఎట్టకేలకు వారం తరువాత హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడంపై లక్ష్మీపార్వతి నోరువిప్పారు. ఆమె పదవికి రాజీనామా చేస్తారని కొందరు, ఎన్టీఆర్ పేరు కోసం పోరాడతారని మరికొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఆమె మౌనంగా ఉండడాన్ని కూడా చాలా మంది ప్రశ్నించారు. ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతి స్పందించిన తీరు అన్నగారి అభిమానులకు ఆగ్రహం కలిగిస్తోంది.
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పును లక్ష్మీపార్వతి సమర్థించారు. రూపాయ డాక్టర్ గా పేరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టడం సబబేనంటూ జగన్మోహన్ రెడ్డికి కితాబు ఇచ్చారు. మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరును పెట్టడానికి ప్రతిపాదన తీసుకెళతానని చెప్పారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం గొప్పగా ఉందని ఆమె అన్నారు. ఆ జిల్లాలోని యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరున్నా, లేకున్నా పెద్ద నష్టంలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాకు కావాలా? హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కావాలి? అని అడిగితే జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలనే ఆప్షన్ తీసుకుంటున్నానని లక్ష్మీపార్వతి చెప్పడం గమనార్హం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు ఏ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించాలని గతంలో చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ మాట్లాడారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ పేరును తొలగించాలని నాయుడు ఇప్పటికే నిర్ణయించుకున్న తర్వాత పేరు మార్పు విషయంలో ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఏముందని ఆమె నిలదీశారు.
విజయవాడను ఎన్టీఆర్గా మార్చిన తర్వాత వైఎస్ జగన్కు ఎన్టీఆర్ పట్ల ఉన్న గౌరవం ఏంటో తెలిసిందని లక్ష్మీపార్వతి అన్నారు. ఇది ఎన్టీఆర్ను అగౌరవపరచడం కాదని అన్నారు. త్వరలోనే తాను సీఎం వైఎస్ జగన్ను కలుస్తానని, ఓ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరనున్నట్లు ఆమె తెలపడం విచిత్రం.
Related News
AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.