Andhra Pradesh: ఏపీలో దారుణం.. బైక్పైనే మృతదేహం
మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై వైద్య సిబ్బంది తీరు మరింత కుంగదీస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్
- Author : Praveen Aluthuru
Date : 17-01-2024 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh: మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై వైద్య సిబ్బంది తీరు మరింత కుంగదీస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్ , ఆటోలకు డబ్బులు చెల్లించే స్తోమత లేక సొంతవారి మృతదేహాలను తమ బైక్ లపైనే తీసుకెళ్తున్న దుస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సమయానికి అంబులెన్స్ రాక.. ప్రైవేటు వాహనం అందుబాటులో లేక చేసేదేమీ లేక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన దయనీయమైన ఘటన అందరినీ కలచివేసింది.
అంబులెన్స్, ఇతర రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విజయనగరంలో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనంపై తమ ఇంటికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన విజయనగరం శృంగవరపు కోట గిరిశికర గ్రామంలో చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. సాధారణంగా వేగంగా స్పందించే ఆటో రిక్షాలు కూడా మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తమ గ్రామమైన చిట్టెంపాడుకు తరలించేందుకు నిరాకరించాయి. వేరే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళ్లారు.
చిట్టెంపాడు గ్రామంలో రోడ్డు నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్టెంపాడు గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు వాపోతున్నారు. తెలంగాణ మరియు ఏపీలోని అనేక మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దీనంగా ఉంది. దీంతో వాహనాలు నిరాకరిస్తుండటంతో మృతదేహాలను సొంతంగా బైక్అం పైనే తీసుకెళ్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అంబులెన్స్ కొరత కేవలం లాజిస్టికల్ లోపంగా మాత్రమే కాకుండా ఇప్పటికీ మిగిలి ఉన్న ఆరోగ్య సంరక్షణ అసమానతలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
Also Read: Telangana: తెలంగాణలో JSW 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు