KVP-Jagan : తాడేపల్లిని తాకిన వైఎస్ ఆత్మ! త్వరలో విడుదల
కరుడుకట్టిన కాంగ్రెస్ వాది కేవీపీ . వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా ఉన్నారు. కానీ,
- By CS Rao Published Date - 01:09 PM, Sat - 1 April 23
కరుడుకట్టిన కాంగ్రెస్ వాది కేవీపీ రామచంద్రరావు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా ఉన్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డికి (KVP-Jagan)మాత్రం తొలి నుంచి దూరంగా ఉంటున్నారు. అలా ఎందుకు ఉంటున్నారు? అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికరీ (unknown fact)తెలియదు. ఆయన ఎక్కడా బయట పెట్టలేదు. త్వరలోనే చెబుతానని ప్రకటించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నానో చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. అంటే, త్వరలోనే ఏదో పెద్ద బాంబ్ పేల్చడానికి కేవీపీ సిద్దమవుతున్నారని అర్థమవుతోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా కేవీపీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జూలు విదిలించాల్సిన సమయం వచ్చిందని రెండు రోజుల క్రితం కేవీపీ అన్నారు. ఢిల్లీ రాజకీయాలపై ఆయన ఫోకస్ చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సీనియర్ రాజకీయ నాయకునిగా చంద్రబాబుమీద ఉందని గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కీలకం కావాలని కోరారు. రాహుల్ గాంధీ మీద అన్హత వేటు పడిన తరువాత కేవీపీ ఆ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంటే, చంద్రబాబునాయుడు నాయకత్వం మీద ఆయనకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడగల సత్తా చంద్రబాబుకు ఉందని నమ్ముతూ జాతీయ రాజకీయాల వైపు చూడాలని కోరారు.
జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద గాసిప్స్ (Unkown fact)
రాజకీయంగా చంద్రబాబు సమర్థతను మెచ్చుకుంటోన్న కేవీపీ ఎందుకు జగన్మోహన్ రెడ్డితో (KVP-Jagan)దూరంగా ఉన్నానో చెబుతానంటూ శనివారం ప్రకటించారు. అంటే, ఏదో తెలియని అంశాన్ని బయట పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిగట్టును బయట వేయడానికి కేవీపీ సిద్దంగా ఉన్నారని అర్థమవుతోంది. పలు రకాల గాసిప్స్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద, ఆయన ఇంట్లో ఉండే తీరు మీద ఉన్నాయి. అంతేకాదు, రాజశేఖర్ రెడ్డి బతికున్న టైమ్ లో ఏమి జరిగింది? అనేదానిపై చాలా అనుమానాలకు తావిచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు అనేకం చూశాం. వాటికి సమాంతరంగా ఉండే అంశాలను కేవీపీ చెబుతారా? లేక వాళ్లిద్దరి మధ్యా నెలకొన్ని వ్యక్తిగత అంశాలను చెబుతారా? (Unknown fact )అనేది పెద్ద చర్చగా మారింది.
Also Read : Jagan graph : వైసీపీలో ఏప్రిల్ 3 టెన్షన్, నో టిక్కెట్ జాబితా రెడీ
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన మనస్తత్వం, కుటుంబ వ్యవహారాలు అన్ని తెలిసిన వ్యక్తిగా కేవీపీ ఉన్నారు. ఇంటి గుట్టును ఎప్పుడూ బయట పెట్టలేదు. సోనియాను వ్యతిరేకించిన తరువాత జరిగిన పరిణామాల క్రమంలోనూ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన వైఎస్ ఆత్మ ఇప్పుడు మాట్లాడేందుకు సిద్దమవుతోంది.
ఎన్నికల సమయంలో కేవీపీ ఇంటిగుట్టు (Unknown fact)
ఇప్పటి వరకు సైకోగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ గా, అవినీతిపరునిగా, ఆక్రమ ఆస్తులు సంపాదించిన దోపిడీదారునిగా వర్ణిస్తూ వచ్చింది. వాటికి భిన్నమైన కోణాన్ని కేవీపీ బయటప పెడతారా? అనేది కూడా హాట్ టాపిక్ అయింది. మొత్తం మీద ఎన్నికల సమయంలో కేవీపీ ఇంటిగుట్టును(Unknown fact) బయటపెట్టడానికి సిద్ధం కావడం మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వైఎస్ ఆత్మగా ఉన్న తాను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరంగా ఉన్నానో చెబుతానంటూ సంకేతాలు ఇస్తేనే తాడేపల్లి వర్గాల్లో కలకలం బయలు దేరింది. ఇక దూరంగా ఎందుకు ఉన్నారో అసలు విషయం బయటేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
Also Read : Jagan plan : మూడోసారి క్యాబినెట్ ప్రక్షాళన,సీనియర్లకు ఛాన్స్ ?
Related News
Yatra 2 : జగన్ బయోపిక్ యాత్ర 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే..
మహి రాఘవ దర్శకత్వంలో జీవా హీరోగా యాత్ర 2 సినిమా జగన్ బయోపిక్ గా తెరకెక్కుతుంది.