HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Kothapalli Subbarayudu To Rejoin Tdp

Kothapalli SubbaRayudu : టీడీపీ గూటికి `పాత కాపు కొత్త‌ప‌ల్లి`?

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు.

  • By Hashtag U Published Date - 03:00 PM, Thu - 2 June 22
  • daily-hunt
Tdp Kothapalli Subbarayudu
Tdp Kothapalli Subbarayudu

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ట‌చ్ లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన వైసీపీ ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఎలాంటి నోటీసులు జారీ చేయ‌కుండా ఆయ‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకుంది. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోని ప‌నిచేసిన ఆయ‌న గోదావ‌రి జిల్లాల్లో బ‌ల‌మైన నాయకుడు. చంద్ర‌బాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన త‌రువాత మారిన ఈక్వేష‌న్ల క్ర‌మంలో టీడీపీని వీడారు.

1981లో ఇండిపెండెంట్‌గా నరసాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచిన సుబ్బారాయుడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు. మధ్యలో ఒకసారి నరసాపురం ఎంపీగానూ గెలిచారు. కీల‌క లీడ‌ర్ గా ఎదిగిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు 2009లో చిరంజీవిని న‌మ్ముకుని రాజ‌కీయంగా మునిగిపోయారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టేస‌రికి 2009లో పీఆర్పీలో చేరిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా డార్క్ లోకి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ పార్టీ పీఆర్పీలో విలీనం త‌రువాత 2011లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌రువాత 2014లో వైపీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి గుడ్‌బై చెప్పి చంద్రబాబు చెంత‌కు చేరారు. కీల‌క‌మైన‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆయ‌న‌కు చంద్ర‌బాబు అప్ప‌గించారు. వివిధ ఈక్వేష‌న్ల న‌డుమ 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌కుండా ఆయ‌న్ను ప‌క్క‌న బెట్ట‌డంతో వైసీపీ త‌రపున న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కు మ‌ద్దతు ప‌ల‌క‌డం ద్వారా తిరిగి జ‌గ‌న్ గూటికి చేరారు. ఆనాటి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఒంగోలులో జరిగిన మ‌హానాడు హిట్ కావ‌డంతో టీడీపీ పెద్ద‌ల‌కు ట‌చ్ లోకి వెళ్లాడ‌ని టాక్‌. అందుకే, సుబ్బారాయుడుపై వైసీపీ స‌స్పెండ్ వేసింద‌ని తెలుస్తోంది.

స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మేమిటో చెప్పాల‌ని, లేనిప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానంటూ వైసీపీకి కొత్తప‌ల్లి అల్టిమేటం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీపై ఒక్క మాట కూడా అన‌లేద‌న్న కొత్త‌ప‌ల్లి, ఏ త‌ప్పు చేయ‌కుండానే పార్టీ వేటు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎందుకు సస్పెన్ష‌న్ వేటు వేయ‌డం లేద‌ని నిల‌దీశారు.స‌స్పెన్ష‌న్‌కు గ‌ల కార‌ణాల‌ను మీడియాకు విడుద‌ల చేయాల‌ని, లేదంటేచ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు.

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న. కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ఇటీవ‌ల జరిగిన జిల్లాల విభ‌జ‌న విష‌యంలో త‌న పంథాను
నెర‌వేర్చుకోలేక‌పోయారు. భీమవ‌రం కేంద్రంగా ఏర్ప‌డిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాను ఆయ‌న వ్య‌తిరేకించారు. జిల్లా కేంద్రంగా న‌ర‌సాపురంను చేయాల‌ని డిమాండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సానుకూల స్పంద‌న లేక‌పోవ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చి త‌ప్పుచేశాన‌ని త‌న చెప్పుతో తాను కొట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆనాటి నుంచి పార్టీ హైక‌మాండ్ ఆయ‌న‌పై గుర్రుగా ఉంది. తాజాగా ఆయ‌న టీడీపీతో ట‌చ్ లో ఉన్నాడని తెలుసుకుని స‌స్పెండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kothapalli SubbaRayudu
  • TDP chandrababu naidu
  • telugu desam party

Related News

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd