Kethamreddy Vinod Reddy : జనసేనాను నాశనం చేస్తుంది నాదెండ్లే – కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేన పార్టీని నాశనం చేస్తుంది మనోహరే అని వినోద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో, పవన్ కల్యాణ్ పార్టీ లేదన్నారు
- By Sudheer Published Date - 04:19 PM, Mon - 16 October 23
రీసెంట్ గా జనసేన పార్టీ (Janasena Party) కి రాజీనామా చేసిన వైసీపీ (YCP) లో చేరిన నెల్లూరు జిల్లాకు చెందిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి (Kethamreddy Vinod Reddy) తాజాగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. జనసేన పార్టీని నాశనం చేస్తుంది మనోహరే అని వినోద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో, పవన్ కల్యాణ్ పార్టీ లేదన్నారు. ఈ రోజు జనసేన పార్టీలో నాలాంటి వారు ఎందరో పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే కోరికతో చాలా కష్టపడ్డారు. నేను పని చేసింది పవన్ కల్యాణ్ గారి కోసమే. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ప్రతి ఇంటికి తిరిగాను… ఆయన కోసం శిలఫలకం వేశాను. ఆయన కూడా తనకు పార్టీలో గౌరవం దక్కలేదని అన్నారు. నేను డబ్బులు తీసుకోని వచ్చాను, వైసీపీ కోవర్టునంటూ కొందరు నన్ను విమర్శిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మీరు ఎంత డబ్బులు ఇస్తే జనసేన పార్టీలో నేను పని చేశాను. ఎంత డబ్బులు తీసుకుని నేను జనసేనాలోకి వచ్చాను చెప్పండి అంటూ వినోద్ ప్రశ్నించారు. పార్టీని ఎదగకుండా ఎలా చేయాలా అనేవి జరుగుతున్నాయి. అయితే ఇవ్వన్నీ పవన్ కల్యాణ్ గారికి తెలియదు. ఆయన పక్కన ఉన్న నెంబర్ టూ ఒకరు ఉంటారు. నాదెండ్ల మనోహర్ అనే ఒక బ్లాక్ హోల్ ని పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. ఎవరైనా పవన్ కల్యాణ్ కోసం నాలాగా కష్టపడే వారిని బయటకు పంపడం మీదే నాదెండ్ల మనోహర్ పని చేస్తున్నారు. జనసేనను నాదెండ్ల మనోహర్ నాశనం చేస్తున్నారు. నాదెండ్ల వల్ల జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు” అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Mecha Nageswara Rao : తన రాజకీయ గురువు తుమ్మలే అంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే
Related News
AP Polls : ఏ కలలు నిజం చేసాడని జగన్ కు ఓటు వేయాలి..? పవన్ సూటి ప్రశ్నలు
కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు