Janasena : ఊరూవాడ జనసేన పుస్తకాలు
రాజ్యాధికారం దిశగా దూకుడుగా వెళుతోన్న జనసేన పార్టీ ప్రస్థానం పుస్తక రూపంలోకి వచ్చేసింది
- By CS Rao Published Date - 02:13 PM, Fri - 20 May 22
రాజ్యాధికారం దిశగా దూకుడుగా వెళుతోన్న జనసేన పార్టీ ప్రస్థానం పుస్తక రూపంలోకి వచ్చేసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎనిమిదేళ్ల ప్రయాణం పూసగుచ్చినట్టు ప్రింట్ వేశారు. ఏడు వాల్యూమ్ లు పార్టీ ప్రస్థానం గురించి రాయడానికి సరిపోయింది. ఆ పుస్తకాలను బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే వాటిని అధికారికంగా పవన్ కల్యాణ్ విడుదల చేయడం జరిగింది. జనసేన పార్టీ ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 14న జనసేన అవతరించింది. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జనసేన పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభ నిర్వహించింది.
ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలను పుస్తకాల రూపంలో తీసుకువచ్చారు. ఏడు సంకలనాలుగా రూపొందించిన ఈ పుస్తకాలను జనసేన మీడియా విభాగం శుక్రవారం హైదరాబాదులో పవన్ కల్యాణ్ కు అందించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ మీడియా విభాగం ప్రతినిధులను అభినందించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయని అన్నారు. ఈ ప్రస్థానంలో జనసేన పార్టీ ప్రజలతో ఎంతగా మమేకం అయిందీ, ప్రజాసేవకు ఏ విధంగా చిత్తశుద్ధితో అంకితమైందీ. ఈ ఏడు సంకలనాలు తెలియజేస్తున్నాయని వివరించారు.
పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధివిధానాలు, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పుస్తకాలు తనకు ఒక దిక్సూచిలా ఉన్నాయని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో మాట్లాడినవి, స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకు ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్, మీడియా విభాగం ప్రతినిధులు చక్రవర్తి, ఎల్. వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చేయని వినూత్న ప్రస్తానాన్ని పుస్తక రూపంలోకి జనసేన తీసుకొచ్చింది. వాటిని త్వరలోనే ప్రతి గ్రామాంలోనూ ఉండేలా పంపిణీ చేయడానికి సిద్దం అవుతున్నారు. ఈసారి రాజ్యాధికారం దిశగా పవన్ అడుగులు వేస్తున్న క్రమంలో పుస్తకాలు ఉపయోగ పడతాయని భావిస్తున్నారు.
Tags
Related News
AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.