Janasena : జనసేన 18 నియోజకవర్గ అభ్యర్థులు వీరే..
మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది
- Author : Sudheer
Date : 24-03-2024 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన నుండి బరిలోకి దిగే అభ్యర్థుల వివరాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
జనసేన అభ్యర్థులు వీరే..
1. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్
2. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి
3. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ
5. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ
6. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్
7. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్
8. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు
9. యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్
10.పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ
11. రాజోలు నుంచి దేవ వరప్రసాద్
12. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్
13. భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు
14. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్
15. ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు
16. పోలవరం నుంచి చిర్రి బాలరాజు
17. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు
18. రైల్వే కోడూరు నుంచి డా.యనమల భాస్కర రావు
త్వరలో జరగబోయే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన.. బిజెపి, టీడీపీ తో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో , 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాకినాడ నుండి జనసేన లోక్ సభ అభ్యర్థిగా ఉదయ్ బరిలోకి దిగుతున్నారు.