CM Jagan : బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదు – సీఎం జగన్
- By Sudheer Published Date - 02:30 PM, Thu - 14 December 23
పలాసలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (Barrelakka) కు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ (Janasen Party) కి రాలేదని , కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ కి దక్కలేదని ఎద్దేవా చేసారు.
గురువారం పలాసలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project) ప్రాజెక్టు తో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Centre), సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సహించలేదని, ఇలాంటి పరిస్థితిలో తమ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మించినట్లు.. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు… సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ వంటి పరికరాలతోపాటు ఐసీయూ సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు.
ఇదే సందర్బంగా మాజీ సీఎం చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు కురిపించారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చంద్రబాబు ఎత్తులు , పొత్తుల మీద ఆధారపడతాడని..తెలంగాణ అసెంబలి ఎన్నికల్లో తన దత్తపుత్రుడ్ని బరిలో నిల్చోపెడితే కనీసం డిపాజిట్ కూడా రాలేదని..అంతే ఎందుకు నా చెల్లెమ్మ బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా ఆ పార్టీ కి రాలేదని జగన్ ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు , దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదని జగన్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటారు..విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తారంటూ తనదైన శైలిలో జగన్ కామెంట్స్ చేసారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏంచేయాలో నిర్ణయిస్తామంటారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
Related News
Congress vs YSRCP : శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చిందా..!
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు లాభపడగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.