HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Office Shifting Jagan Camp Office Activities From Visakhapatnam After Dussehra Festival

Jagan Office Shifting : ఛ‌లో వైజాగ్…ముహూర్తం ఫిక్స్

Jagan Office Shifting : విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌డానికి ముహూర్తం ఫిక్స్ అవుతోంది. ద‌స‌రా త‌రువాత జ‌గ‌న్ క్యాంప్ వైజాగ్ మారనుంది.

  • By CS Rao Published Date - 04:40 PM, Thu - 7 September 23
  • daily-hunt
Jagan Office Shifting
Jagan Office Shifting

Jagan Office Shifting : విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌డానికి ముహూర్తం ఫిక్స్ అవుతోంది. ద‌స‌రా త‌రువాత నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాంప్ వైజాగ్ మారనుంది. ఆ మేర‌కు ఏర్పాట్ల‌ను ముమ్మ‌రంగా చేస్తున్నారు. ఆయ‌న అక్క‌డ‌కు మ‌కాం మార్చ‌గానే, మూడు రాజధానుల ముచ్చ‌ట తీరిన‌ట్టేన‌ని వైసీపీ భావిస్తోంది. చ‌ట్ట ప్ర‌కారం మాత్రం మూడు రాజ‌ధానులు అనే విధానం సాధ్య‌ప‌డ‌దు. విభ‌జ‌న చ‌ట్టంలోనూ అలాగా ఎక్క‌డా పొందుప‌ర‌చ‌లేదు. అనుకూల రాజ‌ధాని ప్రాంతాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాల‌ని సూచించింది. అంతేగానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ మార్చుకోవ‌డానికి లేద‌ని లేదు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైజాగ్ వెళుతున్నార‌ట‌.

ద‌స‌రా త‌రువాత మూడు రోజుల పాటు వైజాగ్ (Jagan Office Shifting)

గ‌త మూడేళ్లుగా మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపిస్తున్నారు. అందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. మండ‌లిలో రివ‌ర్స్ అయింది. ఆ త‌రువాత న్యాయ‌స్థానం ఎంట్రీ కావ‌డంతో ఆయ‌న మ‌నసు రివ‌ర్స్ అయింది. అనివార్యంగా మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకున్నారు. చ‌ట్ట‌బ‌ద్ధంగా ప్ర‌స్తుతం ఒకటే రాజ‌ధాని, అదే అమ‌రావ‌తి. కానీ, ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ఉందంటూ మంత్రి బొత్సా ప‌లుమార్లు చెప్పారు. ఏపీ రాజ‌ధాని ఏది? అంటే అమ‌రావ‌తి అంటూ చెప్ప‌లేక‌పోతున్నారు. ఇంకా హైద‌రాబాద్ ఏపీ రాజ‌ధాని అంటూ మంత్రులు చెబుతున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం అధికార వికేంద్రీక‌ర‌ణ అంటూ వైజాగ్ కు క్యాంపు ఆఫీస్ ను (Jagan Office Shifting) మార్చేస్తున్నారు. అందుకోసం రుషికొండ‌ను తొలిచేశారు.

మూడేళ్లుగా మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట‌

ద‌స‌రా త‌రువాత మూడు రోజుల పాటు వైజాగ్ నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ (Jagan Office Shifting) కార్య‌క‌లాపాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో మిగిలిన రోజుల్లో మాత్రం తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీస్ వ‌ద్ద ఆయ‌న ఉండేలా షెడ్యూల్ చేస్తున్నారు. గ‌తంలోనూ 2014 ఎన్నిక‌ల త‌రువాత చంద్ర‌బాబు ఇలాగే ప్లాన్ చేశారు. మూడు రోజులు హైద‌రాబాద్, మూడు రోజులు విజ‌య‌వాడ‌, ఒక రోజు ఢిల్లీ అనేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు ఏకంగా ఏపీ వ‌ర‌కు పరిమితం చేసేలా చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. అదే త‌ర‌హాలో ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను మార్చే టైమ్ కి ఎన్నిక‌ల‌కు రాబోతున్నాయి. ప‌ర్మినెంట్ గా ఎక్క‌డ ఉండాలో నిర్ణ‌యించే ఎన్నిక‌ల‌కు అవి. అందుకే, ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ మ‌రోసారి అధికారాన్ని ఇస్తుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు.

Also Read : Jagan London Secret : ప్ర‌త్యేక విమానంలో సాల్వే మూడో పెళ్లికి..?

గ‌త ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా కూడా ఇలాగే ముహూర్తం పెట్టారు. కానీ, తాడేప‌ల్లి నుంచి ప‌రిపాల‌న సాగింది. కానీ, ఈసారి సీరియ‌స్ అంటూ ఎంపీ సాయిరెడ్డి, టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. సెప్టెంబ‌ర్లోనే షిఫ్టింగ్ అంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు కొన్ని రోజుల్లోనే తాడేప‌ల్లి ఖాళీ చేయాలి. కానీ, అలాంటి హ‌డావుడి క‌నిపించ‌డంలేదు. ద‌స‌రా త‌రువాత మార్పు జ‌రుగుతుంద‌ని మాత్రం చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లండ‌న్లో ఉన్నారు. ఈనెల 12న ఆయ‌న తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఆ త‌రువాత విశాఖ షిప్టింగ్ వేగ‌వంతం అవుతుంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్. వారానికి మూడు రోజులు విశాఖ‌, మిగిలిన రోజులు తాడేప‌ల్లి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆప‌రేష‌న్స్ ఉంటాయ‌ని తెలుస్తోంది.

Also Read : Jagan London tour : జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వెనుక‌ బ్లాక్ ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • cm camp office
  • vizag

Related News

Air Pollution Vizag

Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం

Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు

    Latest News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Karnataka CM Post : హైకమాండ్ ఎప్పుడు చెపితే అప్పుడు డీకే సీఎం అవుతాడు – సిద్దరామయ్య

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • Samantha 2nd Wedding : సమంత ను విలన్ ను చేసిన మేకప్ స్టైలిస్ట్ ..?

    • Warning : తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోం..పవన్ కు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి

    Trending News

      • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

      • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

      • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

      • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

      • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd