HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Intelligence Warning Of Clashes In Kakinada Pithapuram

AP Violence: కాకినాడ – పిఠాపురంలో ఇంటెలిజెన్స్ హెచ్చరిక

అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎన్నికలు భిన్నంగా మారాయి.

  • By Kavya Krishna Published Date - 04:21 PM, Mon - 20 May 24
  • daily-hunt
Ap Violence
Ap Violence

అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎన్నికలు భిన్నంగా మారాయి. అధికారంలో ఉన్న నేతలే ఓటమి భయంతో ప్రత్యర్థులపై దాడికి దిగారు. ఓటమి అంచున ఉన్నా మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ.. కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లకు కూడా దిగి కొన్ని చోట్ల విధ్వంసం సృష్టించారు. అయితే.. ఏపీలో పోలింగ్‌ ముందు నుంచి జరిగిన అన్ని అసాంఘీక కార్యకలాపాల గురించి నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ యంత్రంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్నా కొన్ని చోట్ల ఇంకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల్లో చిచ్చు పెడుతూ అల్లర్లకు తెరలేపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో , ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాల్సి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా కౌంటింగ్ సమయంలో, ఫలితాల వెల్లడి తర్వాత కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. కాకినాడ నగరం, పిఠాపురం ప్రాంతాల్లో హింసాత్మక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ముందు, తర్వాత తగాదాలు తలెత్తే అవకాశం ఉందని నిఘా విభాగం ఈసీకి నివేదిక సమర్పించింది. ముఖ్యంగా ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట తదితర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గత ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికలకు సంబంధించిన తగాదాలకు సంబంధించి గతంలో కేసులున్న వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే కాకినాడలో గతవారం పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పిఠాపురం, కాకినాడలో పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also : Vehicle Registration: షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • ap news
  • AP Violence
  • clashes in Kakinada - Pithapuram
  • intelligence alert

Related News

Cable Bridge

Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd