AP Rains : చిత్రావతి నదిలో చిక్కున్న కారు…10 మందిని కాపాడిన అధికారులు
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది మధ్యలో చిక్కుకుపోయిన 10 మందిని బెంగళూరులోని యలహంక నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ శుక్రవారం రక్షించింది.
- By Hashtag U Published Date - 10:43 AM, Sat - 20 November 21
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది మధ్యలో చిక్కుకుపోయిన 10 మందిని బెంగళూరులోని యలహంక నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ శుక్రవారం రక్షించింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నలుగురు ప్రయాణీకులతో కూడిన కారు నీటి ప్రవాహం కారణంగా నది మధ్యలో ఇరుక్కుపోయింది, ధర్మవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమాకాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో వారిని తీసుకువచ్చి రక్షించే ప్రయత్నం చేశారు.
ఎర్త్మూవర్ తీసుకువచ్చిన అధికారులు దాని ద్వారా ప్రయాణికులను రక్షించేందకు ప్రయత్నించారు. కానీ అది నది కట్ట వద్దకు 250 మీటర్ల వెళ్లిన తరువాత ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద రావడంతో అది ముందుకు కదల్లేకపోయింది. మరోవైపు ఎర్త్ మూవర్ కూడ వరదలోనే చిక్కుకుంది.జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సెల్వరాజన్తో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫక్కీరప్ప వెంటనే డీజీపీతో ఘటనను వివరించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మాట్లాడగా…. ముఖ్యమంత్రి విశాఖపట్నంలోని భారత నావికాదళ అధికారులతో సంప్రదింపులు జరిపారు, అయితే ప్రతికూల వాతావరణం మరియు దూరం కారణంగాయలహంకలోని భారత వైమానిక దళాన్ని సంప్రదించారు. స్క్యూ ఆపరేషన్ కోసం Mi-17-IV హెలికాప్టర్ వచ్చింది.
1.40 గంటలకు హెలికాప్టర్ ఘటనా స్థలానికి చేరుకుంది. ఎర్త్మోవర్లో చిక్కుకుపోయిన మొత్తం 10 మంది వ్యక్తులను రక్షించడానికి దాదాపు ఒక గంట సమయం పట్టింది. IAFలోని ఏడుగురు సిబ్బంది 10 మందిని రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. సహాయకచర్యల్లో పాల్గొన్న ఐఏఎఫ్ యలహంక బృందానికి ఎస్పీ ఫకీరప్ప ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ప్రయాణికులను రక్షించామని ఆయన తెలిపారు.
Tags
Related News
Rain Alert Today : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు దక్షిణాన తీరం దాటింది.