Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను మరోసారి వాయిదా వేసిన సుప్రీం కోర్ట్
ఉదయం నుండి కూడా చంద్రబాబు (Chandrababu) తరుపు లాయర్లు..ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి.
- By Sudheer Published Date - 04:20 PM, Tue - 10 October 23

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం నుండి కూడా చంద్రబాబు (Chandrababu) తరుపు లాయర్లు..ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున వాదనలు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
17ఎ సెక్షన్కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను కోర్ట్ కు ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి వాదనలు పునఃప్రారంభమయ్యాయి. వెంటనే ధర్మాసనం కేసు విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ( Inner Ring Road Case)లో నోటీసులు అందుకున్న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న లోకేష్.. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారిస్తుండగా..కొద్దీ సేపటి క్రితం భోజన విరామం ఇచ్చారు. విరామం ముందు వరకు దాదాపు గా మూడు గంటల పాటు పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ పై సీఐడీ (CID) ప్రశ్నల వర్షం కురిపించింది.
దీంతో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు..? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది..? 2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా..? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి..? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేసారు..? చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా మొత్తం లోకేష్ ను సీఐడీ దాదాపు 16 అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది.
Read Also : CPI – CPM – Each 5 : చెరో 5 కావాలంటున్న వామపక్షాలు.. చెరో 2 ఇస్తామంటున్న కాంగ్రెస్ !