HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Fishermen

AP Budget 2025-26 : మత్స్యకారులకు గుడ్ న్యూస్

AP Budget 2025-26 : ఎన్నికల హామీ మేరకు అర్హులైన సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధ కాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు

  • Author : Sudheer Date : 28-02-2025 - 1:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News For Fishermen
Good News For Fishermen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌(AP Budget 2025-26)లో మత్స్యకారులకు పెద్ద ఊరట(Good news for fishermen)ను అందించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో మత్స్య, ఆక్వా రంగాన్ని ప్రోత్సహించే అనేక కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధ కాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల 1,22,968 మంది మత్స్యకారులకు మొత్తం రూ.245.936 కోట్లు అందజేస్తామని వెల్లడించారు. అలాగే పులికాట్ సరస్సులోని 20వేల మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధి కోసం తిరుపతి జిల్లాలో సముద్ర ముఖద్వారం తెరవేందుకు రూ.97.09 కోట్లతో పనులను చేపట్టనున్నారు.

ఆక్వా రైతులకు రాయితీలు, సబ్సిడీలు

ఆక్వాకల్చర్ రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు, అర్హత కలిగిన 68,134 ఆక్వా సర్వీసు కనెక్షన్లకు తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్క యూనిట్‌కు రూ.1.50 పైసల చొప్పున విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అలాగే, డీజిల్‌ ఆయిల్‌ సబ్సిడీ కింద 2024-25లో రూ.50 కోట్లు ఖర్చు చేసి 28,058 బోట్లకు ప్రయోజనం అందించినట్లు తెలిపారు. 2025-26లోనూ అదే విధంగా రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆక్వా రైతుల కోసం PMMSY పథకం కింద రూ.417 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

మత్స్యరంగ అభివృద్ధికి భారీ కేటాయింపులు

ప్రభుత్వం మత్స్యరంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మద్దతుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 సంవత్సరానికి మొత్తం రూ.510.189 కోట్లు మత్స్యరంగ అభివృద్ధికి కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో మరణించగా, వారి కుటుంబాలకు బకాయి ఉన్న రూ.3.15 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించినట్లు వెల్లడించారు. అలాగే, 2025-26లో ఈ నిధిని రూ.8 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా వ్యవసాయ, మత్స్య, ఆక్వా రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap budget 2025-26
  • Good news for fishermen
  • Minister Payyavula Keshav

Related News

Kcr Pm 3

కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!

ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి

  • Pulse Polio Programme

    నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు

  • స్టార్టప్‌ వీసాకు కెనడా గుడ్‌బై: 2026లో కొత్త వ్యాపార ఇమిగ్రేషన్ స్కీమ్‌?

  • ఒకరిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకొకరికి ఇవ్వవచ్చా దోషము ఉంటుందా !

  • నిరంతర అలసటకు అసలు కారణం నిద్ర లోపమేనా? నిపుణుల హెచ్చరికలు ఇవే!

  • శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!

Trending News

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd