Gokulas in AP : గోకులాలను ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయం
Gokulas in AP : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోకులాలను (Gokulas ) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది
- Author : Sudheer
Date : 08-01-2025 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో కూటమి సర్కార్ (NDA Govt) సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందం నింపుతుంది. హామీలు ప్రకటించే ప్రభుత్వం కాదు హామీలను నెరవేర్చే ప్రభుత్వం అని మరోసారి చంద్రబాబు (CM Chandrababu) నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఓ పక్క నెరవేరుస్తూనే, మరోపక్క కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను మరింత సంతోష పెడుతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోకులాలను (Gokulas ) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
JIO Warning : కాల్ బ్యాక్ చేస్తే రూ.300 కట్..!
ఈ కార్యక్రమం (Gokulas Program) జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. పశువులకు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెల్టర్ల కోసం ఈ గోకులాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధి పథకంలో కీలక ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గోకులాల ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచనలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనవరి 10న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందని సమాచారం.
Memorial for Pranab Mukherjee : RSSపై ప్రేమవల్లే ప్రణబ్కు స్మారకం – ఎంపీ డానిష్ అలీ
ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ జిల్లాల కలెక్టర్లు, డ్వామా స్కీమ్ సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గోకులాల నిర్మాణం ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనుల సారాంశంలో ఒక భాగమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాల్లో గ్రామ సభల ద్వారా తీర్మానించిన పనులను వేగంగా పూర్తి చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధికి నూతన శక్తిని అందించామని అధికారులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలకు సంబంధించి బ్లూఫ్రాగ్ మొబైల్ యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ గోకులాలు పశు సంరక్షణకు తోడ్పడటంతో పాటు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.