HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Girl Student Hurt In Lathi Charge In Anantapur Students Protest Surrendering Of Aided Status

Police Vs Students : అనంత‌పురంలో తీవ్ర ఉద్రిక్త‌త‌… స్టూడెంట్స్ పై పోలీసుల జులం

ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్ల‌లు త‌మ స్కూల్‌ని విలీనం చేయ‌వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు.

  • Author : Hashtag U Date : 08-11-2021 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్ల‌లు త‌మ స్కూల్‌ని విలీనం చేయ‌వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. తాజ‌గా అనంత‌పురంలోని సాయిబాబా నేష‌న‌ల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు.త‌మ క‌ళాశాల‌ను విలీనం చేసేందుకు యాజ‌మాన్యం అంగీక‌రించ‌డంతో దీనికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళ‌న చేశారు.

ప్ర‌వేట్ ప‌రం చేస్తే అధిక ఫీజులు క‌ట్టాల‌ని త‌మ‌కు అంత స్తోమ‌త లేద‌ని విద్యార్థులు వాపోయారు. అయితే ఈ ఆందోళ‌న చేస్తున్న‌ విద్యార్థుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ మద్దతుతో సుమారు 500 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాల ప్రధాన గేటు వద్ద గుమిగూడారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయ‌గా…నవ్య అనే విద్యార్థిని తల ప‌గిలి తీవ్ర ర‌క్త‌స్రావం అయింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సలో భాగంగా తలపై నాలుగు కుట్లు వేసి సురక్షితంగా ఇంటికి పంపించారు.

III టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డప్ప శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో లాఠీచార్జికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న కొందరు మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకున్నారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24న ఎయిడెడ్ కాలేజీలు తమ ఎయిడెడ్ పోస్టులను సరెండర్ చేసి గుర్తింపు రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలుగా కొనసాగించేందుకు అవకాశం కల్పించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aided schools
  • ananthapur
  • andhra pradesh police

Related News

    Latest News

    • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

    • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

    • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

    • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

    • భోగాపురం ఎయిర్ పోర్ట్ పై బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd