One Killed : నెల్లూరు జిల్లాలో విషాదం.. టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్లు..మహిళ మృతి
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో మూడు గ్యాస్ సిలిండర్లు...
- By Prasad Published Date - 10:05 AM, Sun - 27 November 22
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. వావిళ్ల గ్రామంలో టిఫిన్ సెంటర్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. మృతురాలు రమణమ్మగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ సిలిండర్ల భారీ పేలుడు కారణంగా టిఫిన్ సెంటర్ కుప్పకూలిపోయింది. పేలుడు జరిగినప్పుడు రమణమ్మ ఇంట్లోనే ఉండడంతో ఆమె సజీవ దహనమైంది. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. విడవలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణమ్మ అనే మహిళ అయ్యప్ప మాల ధరించి ఉందని.. ఉదయం నుండే గ్యాస్ లీకేజీ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె అగ్గిపెట్టె వెలిగించిన క్షణంలో ఇంట్లో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని.. ఈ ఘటనలో రమణమ్మ తీవ్ర గాయాలపాలై మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Related News
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.