AP Housing : ఏపీలో ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ..వేలల్లో దరఖాస్తులు
AP Housing : గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలను అందజేయాలని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది
- By Sudheer Published Date - 04:28 PM, Mon - 3 March 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పేదల కలను సాకారం చేయడానికి ఇళ్ల స్థలాల ఉచిత పంపిణీ పథకాన్ని(Free distribution of house plots scheme) ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలను అందజేయాలని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి.
Big Shock To Maoist : 14 మంది మావోయిస్టులు లొంగుబాటు
70,000కి పైగా దరఖాస్తులు – నాలుగు లక్షల ఆర్థిక సాయం
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అసెంబ్లీలో ఈ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 70,232 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, తమ ప్రభుత్వం మాత్రం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తోందని మంత్రి విమర్శించారు.
అందరికీ ఇళ్లు పథకం అర్హతలు
ఈ పథకానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు. మహిళల పేరుతోనే ఈ ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు ఉండాలి, 5 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల్లోపు మాగాణి భూమి కలిగి ఉండాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఈ పథకానికి అర్హులు కారు. ఒకసారి ఇంటి పట్టా మంజూరు అయితే, 10 ఏళ్ల తరువాతే దానికి పూర్తి హక్కులు లభిస్తాయి.
Duvvada : హాట్ ప్రాపర్టీగా మారిన దువ్వాడ
పథకం అమలు – భవిష్యత్ ప్రణాళికలు
ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన రెండేళ్లలోపు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సంబంధిత ఏజెన్సీల సహాయంతో ఇంటి నిర్మాణాలు చేపడతారు. పేదలు తక్కువ సమయంలో సొంత ఇంటిని కలిగి, సురక్షితమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది నిరాశ్రయులు ఇళ్ల కలను సాకారం చేసుకునే అవకాశం ఉంది.