Annamayya District : తిరుమల దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
Annamayya District : అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
- By Pasha Published Date - 07:16 AM, Fri - 15 September 23
Annamayya District : అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ – తుఫాన్ వాహనం ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురు చనిపోగా, 11 మందికి గాయాలయ్యాయి. మృతులను కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి వాసులుగా గుర్తించారు. వీరంతా తుఫాన్ వాహనంలో తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
Also read : Ayodhya Temple Opening : అయోధ్య రామయ్య ప్రతిష్ఠాపనోత్సవం ఏ రోజో ఖరారైంది..!
Related News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది