Posani : సిగ్గులేదా రోజా..ఓ బిల్డప్ ఇస్తావ్..అంటూ రోజా ఫై పోసాని ఫైర్ ..
- By Sudheer Published Date - 11:37 AM, Wed - 4 October 23
సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali )
వైసీపీ మంత్రి రోజా (Minister Roja) ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సిగ్గులేదా రోజా… ఓ బిల్డప్ ఇస్తావ్. నీ ధైర్యం పోయిందా? అంటూ ఫైర్ అయ్యారు.
గత మూడు రోజులుగా మంత్రి రోజా – బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana Murthy) వ్యవహారం మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రోజా ఫై టీడీపీ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే మంత్రి రోజా..చంద్రబాబు , లోకేష్ , బ్రహ్మణి , భువనేశ్వరి లను ఎన్ని మాటలు అన్నంది..అసెంబ్లీ లో ఎలా ప్రవర్తించిందో తెలియదా అంటూ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం మీడియా లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఓ న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ..రోజా ఫై ఫైర్ అయ్యారు. ‘రోజా ఏడవటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? తిరిగి మాట్లాడలేవా? ఎగిరి నా***గ***పై తంతే… గుండె పగిలి చస్తాడు. సిగ్గులేదా రోజా… ఓ బిల్డప్ ఇస్తావ్. నీ ధైర్యం పోయిందా? వాడెవడో కుక్క మొరిగితే…. ఏడుస్తావా? వాడి కళ్ళలో నీళ్లు పెట్టించు’ అని పోసాని హితవు పలికారు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటె.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై పోసాని అనుచిత వాఖ్యలు చేశారని జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఫై పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారి వాదనలు విన్న న్యాయస్థానం పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి పై IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి పోసాని అదుపులోకి తీసుకుంటారో..లేక అధికార పార్టీ నేత అని చెప్పి లైట్ తీసుకుంటారో చూడాలి.
Read Also : World Animal Day 2023 : నేడు ప్రపంచ జంతు దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా..?
Related News
Pawan Kalyan 5th Wife : పవన్ కళ్యాణ్ కు ఐదో భార్య కూడా ఉందంటూ పోసాని సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు