Narayana Bail : మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.
- By CS Rao Published Date - 05:25 PM, Wed - 14 September 22
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక నిందితుడిగా నారాయణ ఉన్నారు. ఆ మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో మంగళవారమే ఏపీ సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణకు 3 నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని నారాయణ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇదే అంశంపై ఓ కేసులో హైకోర్టే నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Related News
AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.