AP Trains : విద్యుత్ తీగలు తెగడంతో.. ట్రైన్స్ రాకపోకలకు స్వల్ప అంతరాయం
AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
- By Pasha Published Date - 06:57 AM, Tue - 19 September 23
AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సి.సిగడం సమీపంలో పలాస – విశాఖ ప్యాసింజర్ రైలు కొన్నిగంటల పాటు నిలిచిపోయింది. దీంతో రైలు ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రైల్వే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టడంతో మళ్లీ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.
Also read : Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం.. నేడు సభ ముందుకు బిల్లు..!
ఇక విజయవాడ సెక్షన్లో భద్రతాపరమైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈనెల 18 నుంచి 24 వరకు కాకినాడ-విశాఖపట్నం-కాకినాడ పాసింజర్ (17267/17268), రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి ప్రత్యేక పాసింజర్ (07466/07467), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ (17239), గుంటూరు-రాయగడ (17243), మచిలీపట్నం-విశాఖ (17219) రైళ్లు క్యాన్సల్ అయ్యాయి. ఈనెల 19 నుంచి 25 వరకు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ (17240), రాయగడ-గుంటూరు (17244), విశాఖ-మచిలీపట్నం (17220) రద్దు చేశారు. అలాగే ఈనెల 18, 19, 20, 22, 23 తేదీల్లో విశాఖ-విజయవాడ-విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్ల (22701, 22702 )ను కూడా క్యాన్సల్ చేశారు.
Related News
AP News: ఏపీ ప్రజలు అలర్ట్.. రేపు 57 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక
AP News: శనివారం 57 మండలాల్లో వడగాల్పులు, ఆదివారం 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 111 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం 15 , విజయనగరం 16, పార్వతీపురంమన్యం 10, అల్లూరిసీతారామరాజు 1, అనకాపల్లి 3, కాకినాడ 5, తూర్పుగోదావరి 6, విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా జామిలో 41.2°C, శ్