AP : జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు – సునీత
గతంతో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని... మీరు చెప్పినట్టు చేశానని తెలిపారు.
- By Sudheer Published Date - 12:47 PM, Tue - 2 April 24
వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda reddy) కుమార్తె సునీత (Sunitha)..మరోసారి జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకి హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ (Jagan) రీసెంట్ గా ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణల ఫై సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తాను, షర్మిల ఇతరుల ప్రభావంతో మాట్లాడుతున్నామని జగన్ అనడం ఫై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని అన్నారు. గతంతో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని… మీరు చెప్పినట్టు చేశానని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని…. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు… పదేపదే మోసం చేయలేరని అన్నారు. వివేకా హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదని… సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని ..అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని… లేకపోతే పాపం చుట్టుకుంటుందని ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు.
Read Also : Kejriwal Daily Routine: జైలులో తొలి ఉదయం.. సీఎం కేజ్రీవాల్ ఏమేం చేశారంటే..
Related News
AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు