Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి...
- By Prasad Published Date - 02:38 PM, Wed - 2 November 22
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు 72,176 మంది భక్తులు తిరుమలను దర్శించుకోగా, 25,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం టైమ్లాట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్ అందుకున్న భక్తుడికి అదే రోజు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తికాగానే కౌంటర్లను మూసివేస్తామని వివరించారు.
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�