TDP vs YCP : టీడీపీ నేత బొండా ఉమాపై దేవినేని అవినాష్ ఫైర్.. చిల్లర వ్యక్తంటూ కామెంట్స్
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ
- By Prasad Published Date - 10:40 PM, Fri - 30 December 22
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ చిల్లర వ్యక్తంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమా కుటుంబం గురించి, పెంపకం గురించి చెప్పాలంటే చాలా ఉందని..తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమా అంటూ ఆరోపణలు చేశారు. కోగంటి సత్యం, ఐలపురం వెంకయ్య దగ్గర డ్రైవర్ గా పని చేసి కాళ్ళు నొక్కి చివరికి వారినే మోసం చేశాడన్నారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే బోండా ఆగడాలపై విచారణ చేసింది వాస్తవం కాదా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని బోండా ఉమా బయటపడ్డాడని.. బైక్ రేసులు, కారు రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చింది బోండా ఉమా, ఆయన కుమారులేనని తెలిపారు. మంత్రి పదవి కోసం చంద్రబాబు ను బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర బోండా ఉమదని విమర్శించారు. కాపుల గొంతు చంద్రబాబు కోసారు అని అప్పట్లో బోండా ఉమా అన్నారని.. మంత్రి పదవి కోసం బ్లాక్ మెయిల్ చేస్తే చంద్రబాబు పిలిచి కబ్జాల లిస్ట్ చూపించి ఉమాకు వార్నింగ్ ఇచ్చారని దేవినేని అవినాష్ తెలిపారు.
ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టే జగన్ నుంచి తనకు ప్రోత్సాహం ఉందన్నారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం గురించి కానీ.. తమ గురించి కానీ మాట్లాడితే తాట తీస్తామని దేవినేని అవినాష్ హెచ్చరించారు. గతంలో ఒకటవ డివిజన్ లో మహిళలు రోడ్డు మీద చెప్పులతో కొట్టిన విషయం బోండా ఉమ గుర్తుoచుకోవాలని.. మరో సారి నోరుజారి మాట్లాడితే అదే రిపీట్ అవుతుందని హెచ్చరించారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. చనిపోయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా దేవినేని నెహ్రు ను ఇప్పటికి టార్గెట్ చేస్తున్నారన్నారు. కోర్టు కేసు కూడా కొట్టేసిన విషయం అందరూ తెలుసుకోవాల్సి ఉందని.. ఇకపై నెహ్రు పేరు ఈ విషయంలో ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామని దేవినేని అవినాష్ తెలిపారు.
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది