HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cricket Betting Addiction Claims 9 In 11 Months Across Andhra Pradesh

11 నెలల్లో తొమ్మిది మందిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్… ఎక్కడంటే..?

యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా

  • Author : Hashtag U Date : 30-10-2021 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా

క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి యువత తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీలో 11 నెలల్లో తొమ్మిదిమంది క్రికెట్ బెట్టింగ్లో అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు.బాధితుల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారు.ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐపీఎల్ బెట్టింగ్లో భారీగా నష్టపోవడంతో చాలా మంది దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ ఏడాది క్రికెట్ బెట్టింగ్ వల్ల జరిగిన మొదటి ఆత్మహత్య ఫిబ్రవరి 28న నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటెక్ విద్యార్థి సి. కిరణ్ (21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ తన పాకెట్ మనీతో బెట్టింగ్లు వేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత చిన్నగా తన స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్లకు పాల్పడ్డాడు. చివరికి ఆ డబ్బును తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తనలాగా ఎవ్వరూ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొని మీ జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని కిరణ్ ఓ నోట్ పెట్టాడు.

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభంలో ఓ 20 ఏళ్ల యువకుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు బానిసైనందుకు ఆ యువకుడిని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విజయ్ సాయి(20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో అతడు తరచూ బెట్టింగ్లలో పాల్గొంటున్నాడని, చదువుకు దూరమై డబ్బులు పోగొట్టుకుంటున్నాడని పోలీసులు తెలిపారు

కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా AP ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన కొద్ది రోజులకే ఏప్రిల్ 28న అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. నంద్యాలలోని మల్దార్పేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకున్న మంచ చంద్రశేఖర్ (35), అతని భార్య కళావతి (30), ఇద్దరు కుమార్తెలు – అంజని (15), అఖిల (13)లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

కరోనా కారణంగా ఐపీఎల్ నిలిపివేయడంతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్లకు సంబంధించిన ఆత్మహత్యలు ఆగిపోయాయని పోలీసులు తెలిపారు. ఇటీవల సెప్టెంబర్లో తిగిరి ఐపీఎల్ ప్రారంభమైన తరువాత ఆత్మహత్యలు పెరిగినట్లు తెలిపారు.తాజాగా సెప్టెంబర్ 21వ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తన నివాసంలో 24 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న బండ్లపూడి మధు అనే బాధితుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసై పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. మధు చివరిసారిగా బంధువులతో మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్స్, కాలేజీలకు పంపిచి తమ బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోకుండా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని పోలీసులు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • betting
  • cricket
  • cricket betting
  • IPL
  • suicide

Related News

Shoaib Akhtar takes a U-turn

యూటర్న్ తీసుకున్న షోయబ్ అక్తర్

Shoaib Akhtar  టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు. ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మా

    Latest News

    • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

    • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd