RajBhavan : ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పరస్పరం ఎదురపడని సీఎం జగన్, చంద్రబాబు..!!
ఏపీ విజయవాడలోని రాజ్ భవన్ లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు.
- By hashtagu Published Date - 10:46 PM, Mon - 15 August 22
ఏపీ విజయవాడలోని రాజ్ భవన్ లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకుని ఎట్ హోం కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, విపక్షనేత చంద్రబాబు దూరం దూరంగా కనిపించారు. ఎక్కడా కూడా ఒకరినొకరు ఎదురుపడలేదు. సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్…గవర్నర్ తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు. టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ మీద కూర్చున్న ద్రుశ్యాలు కనిపించాయి.
ఇక అసెంబ్లీలో తప్ప జగన్, బాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. దాంతో మీడియా ఫోకస్ అంత కూడా ఎట్ హోం కార్యక్రమంపైన్నే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురుపడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు.
Related News
Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు