Chandragiri : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు
- By Sudheer Published Date - 04:41 PM, Tue - 14 May 24

ఏపీలో ఇంకా వైసీపీ (YCP) వర్గీయుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న పోలింగ్ రోజు నానా బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అనేక చోట్ల దాడులు జరిపి నానా రచ్చ చేసిన వైసీపీ వర్గీయులు.ఈరోజు అలాగే కొనసాగిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం చంద్రగిరి (Chandragiri ) నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani)పై దాడి జరిగింది. పులివర్తి నాని ఈరోజు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో పులివర్తి నాని కారు కూడా ధ్వంసం అయింది. ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌంట్ల కాల్పులు కూడా జరిపారు. కాగా ఘటన నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇప్పటివరకు పోలీసులు రాలేదని అనుచరులు ఆరోపించారు. దాదాపు 150 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. వాళ్ల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also : Photo of The Day : మోడీ నామినేషన్ లో చంద్రబాబు & పవన్ కళ్యాణ్