HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu With Isb Hyderabad

Chandrababu ISB : `ఐఎస్ బీ` చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు

హైద‌రాబాద్‌కు ఐఎస్బీ ఎలా వ‌చ్చింది? 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆ సంస్థ స్నాత‌కోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణం ఇది.

  • Author : CS Rao Date : 26-05-2022 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN ISB
Chandrababu Isb

హైద‌రాబాద్‌కు ఐఎస్బీ ఎలా వ‌చ్చింది? 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆ సంస్థ స్నాత‌కోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణం ఇది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌స్తున్న క్ర‌మంలో ఒక‌సారి ఐఎస్బీ పుట్టుపూర్వోత్త‌రాల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే చంద్ర‌బాబు విలువ తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది. ఐఎస్ బీని ఏర్పాటు చేసి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ కు ఎలా వచ్చిందన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలంతా కలిసి అత్యుత్తమ బిజినెస్ స్కూల్ పెట్టాలని నెల‌కొల్పాల‌ని యోచించారు. మానవ వనరుల ఉత్పత్తి కేంద్రంగా ఉండ‌డంతో పాటు దేశానికి త‌ల‌మానికంగా ఉండాల‌ని త‌ల‌పోశారు. అందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను(ఐఎస్ బీ) ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఆ రోజుల్లో వారు బెంగళూరులో ఐఎస్బీని ప్రారంభించాల‌ని తొలుత‌ భావించారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేయటమే కాదు, ఆనాడున్న కర్ణాటక ముఖ్యమంత్రి పాటిల్ ను కలిసి నిర్ణయాన్ని తెలియ‌చేయాల‌ని టాప్ ఇండిస్ట్రియ‌లిస్ట్ లు నిర్ణయించారు. అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు.

ఆ విషయం తెలుసుకున్న ఆనాటి ఉమ్మ‌డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు రావాలని రిక్వెస్ట్ చేశారు. “మీరు కోరుకున్నట్లుగా బెంగళూరులోనే ఐఎస్ బీని పెట్టండి. కానీ అక్క‌డ‌కి వెళ్లేటప్పుడు హైదరాబాద్ కు వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్లాలని కోరారు. అందుకు పారిశ్రామికవేత్త పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ టైంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల డైరెక్టర్ లో ఒకరైన శీనిరాజును సంప్రదించిన చంద్రబాబు , పారిశ్రామికవేత్తల్ని హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని కోరారు.

అప్పట్లో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు ఇమేజ్ ప్ర‌పంచానికి తెలుసు. అదే పనిగా బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని అభ్య‌ర్థిస్తోన్న తీరును కాదనలేక వస్తామని పారిశ్రామిక‌వేత్త‌లు హామీ ఇచ్చారు. ఆ మేర‌కు అందరూ హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. వారందరికి చంద్ర‌బాబు కొసరికొసరి వడ్డించి. వారు స్టార్ట్ చేయబోయే విద్యా సంస్థ గురించి వివరాలు అడిగారే త‌ప్ప హైద‌రాబాద్‌ లో పెట్టాలని వారిని ఇబ్బందికి గురి చేయలేదు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తర్వాత వారంతా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తమ కార్ల వద్దకు వెళ్లగా, చంద్రబాబు స్వయంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కారు వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా వారికి వీడ్కోలు పలికారు.

సీన్ కట్ చేస్తే, హైదరాబాద్ నుంచి స‌దరు పారిశ్రామికవేత్తలు బెంగుళూరు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం ఇచ్చిన టైంకు ఆయ‌న ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కానీ, వేరు పనుల్లో బిజీగా ఉన్న క‌ర్ణాట‌క సీఎం దాదాపు దాదాపు మూడు గంటల పాటు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వెయిట్ చేయించారు. దీంతో, వారంతా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకొని , శీనిరాజుకు ఫోన్ చేశారు. `బెంగళూరులో పెట్టాలనుకున్న బిజినెస్ స్కూల్ ను హైదరాబాద్ లో పెట్టాలనుకుంటున్నాం అంటూ స‌మాచారం ఇచ్చారు. మా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేయండన్నారు.` రాలేమని చెప్పిన బ్రేక్ ఫాస్ట్ కు రప్పించి , వారికి అతిధి మర్యాదలు చేయటం ద్వారా మనసు దోచుకున్న చంద్రబాబు హైదరాబాద్ మణిహారంలో ఒక మణి లాంటి ఐఎస్ బీని తీసుకొచ్చారు. ఇదంతా ఆనాటి ప్ర‌తిప‌క్షాల‌కు కూడా తెలుసు. ఆనాడు ఉమ్మ‌డి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఐఎస్ బీ కోసం చేసిన ప్ర‌య‌త్నం ఎవ‌రూ కాద‌న‌లేరు. ప‌చ్చి వాస్త‌వ‌మ‌ని ఏ పారిశ్రామిక‌వేత్త‌ను అడిగినా చెబుతారు. విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఏం జరుగుతుందన్న విషయం ఐఎస్ బీ చరిత్రలోకి వెళితే తెలుస్తోంది. త‌రాలు మారినా మ‌రువ‌లేని ఐఎస్ బీ చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు పాత్ర న‌భూతోన‌భ‌వ్యిష‌త్‌.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • isb hyderabad
  • pm modi
  • TDP chandrababu naidu

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

Latest News

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd