HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Lays Foundation Stone For Cognizant Campus

Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది

  • Author : Sudheer Date : 12-12-2025 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Naidu Lays Foun
Chandrababu Naidu Lays Foun

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో వేగం పుంజుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన రాష్ట్రం, ఇప్పుడు అగ్రశ్రేణి ఐటీ సంస్థల పెట్టుబడులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ముఖ్యంగా దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant) తమ నూతన క్యాంపస్‌ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కాపులుప్పాడలోని ఐటీ హిల్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కాగ్నిజెంట్‌తో పాటు, టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్శన్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ & ఆర్సీఎం సర్వీసెస్, నానైల్ టెక్నాలజీస్ వంటి మరో 7 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం విశాఖ ఐటీ రంగ వేగానికి నిదర్శనం.

Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టును 2029 నాటికి మొదటిదశ, 2033 నాటికి మూడు దశలు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ కంపెనీలన్నీ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర యువతకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. భారతదేశంలో కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్న 2,41,500 మందిలో 80 శాతం మంది భారతీయులే ఉన్నారని గుర్తు చేస్తూ, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు పూర్తి కాకముందే, విశాఖలో ఐటీ కార్యకలాపాలను తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రుషికొండ ఐటీ పార్కు, హిల్‌-2పై ఉన్న మహతి ఫిన్‌టెక్‌ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమైంది. వేయిమంది సీటింగ్‌ సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ఇది కాగ్నిజెంట్ యొక్క విశాఖపట్నం కార్యకలాపాలకు తాత్కాలిక కేంద్రంగా పనిచేస్తుంది. విశాఖ లాంటి సుందరమైన నగరం నాలెడ్జ్ ఎకానమీ మరియు టెక్నాలజీకి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే నగరానికి మెట్రో రైలు సదుపాయం వస్తుందని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన మరియు భారీ ఐటీ పెట్టుబడులతో, విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే ‘మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీ’గా, ప్రధాన సాంకేతిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 700 Cr Investment
  • 8 Companies involving Rs.3
  • AP CM Lays Foundation
  • chandrababu
  • Cognizant IT campus
  • nara lokesh
  • vizag

Related News

Ap Govt Fee Reimbursement

విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?

  • ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

    ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

  • Amaravati

    అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

  • Quantum Valley

    క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

Latest News

  • Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd