HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Emotional

Chandrababu Emotional : మరోసారి కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు..

Chandrababu Emotional : సోషల్ మీడియా ట్రోలింగ్ పై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆడవారిని టార్గెట్ చేస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 07-11-2024 - 5:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Emoshana
Babu Emoshana

టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఎమోషనల్ (Chandrababu Emotional) అయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో (Inauguration of GIS Sub Station) చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆడవారిని టార్గెట్ చేస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిపై చేస్తున్న ట్రోలింగ్ పై చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలనే అవసరం ఉందని, దేశంలో అందుబాటులో ఉన్న చట్టాలను ఉపయోగించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ట్రోలింగ్ ద్వారా మదమెక్కిన వ్యక్తులు సమాజంలో కలత రేకెత్తిస్తున్నారని, వారికి సరైన క్రమశిక్షణ అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళ పై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగతీసే ప్రయత్నం చేస్తున్నారని, దేనికైనా హద్దులు ఉంటాయన్నారు. హద్దులు దాటితే మాత్రం శిక్ష తప్పదు… దేశంలో, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తున్నామని, ఆడ బిడ్డలపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టింగులు పెడితే, తాట తీసేలా చట్టాలు రూపొందిస్తామంటూ వైసీపీ నేతలకు , వైసీపీ సోషల్ మీడియా వారికి హెచ్చరించారు.

వైసీపీ పార్టీకి సంబదించిన కొంతమంది అధికారం ఉన్నప్పుడే కాదు..ఇప్పుడు అధికారం లేని సమయంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలపై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. రోజు రోజుకు వీరి ఆగడాలు ఎక్కువైపోతుండడం..వీరికి కొంతమంది పోలీసులు కూడా సపోర్ట్ చేస్తుండడం తో వారికీ అడ్డు అదుపులేకుండా పోతుంది. దీంతో రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో ట్రోల్స్ , నీచమైన పోస్టులు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పోలీసులకు సైతం హెచ్చరికలు జారీ చేసాడు. దీంతో నిన్నటి నుండి వరుసపెట్టి వైసీపీ సోషల్ మీడియా వారిని అదుపులోకి తీసుకుంటూ వస్తున్నారు.

Read Also : Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Emotional
  • Inauguration of GIS Sub Station
  • YCP Trolls

Related News

    Latest News

    • Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    • TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

    • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

    • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd