Amaravati Relaunch : మోడీని ఘనంగా సన్మానించిన చంద్రబాబు , పవన్
Amaravati Relaunch : ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధర్మవరానికి చెందిన శాలువాతో మోదీని ఘనంగా సన్మానించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆయనతో కలిసి మాస్టర్ ప్లాన్ మరియు మోదీ ఫొటోతో ఉన్న ఫ్రేమ్ను అందించారు
- Author : Sudheer
Date : 02-05-2025 - 4:32 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం (Amaravati Relaunch) ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెలగపూడి హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సభాస్థలికి కాన్వాయ్ ద్వారా ప్రయాణించి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధర్మవరానికి చెందిన శాలువాతో మోదీని ఘనంగా సన్మానించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆయనతో కలిసి మాస్టర్ ప్లాన్ మరియు మోదీ ఫొటోతో ఉన్న ఫ్రేమ్ను అందించారు.
PM Modi : గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వెలగపూడి వేదిక ప్రజలతో నిండిపోయింది. తాము కలలు కంటున్న రాజధాని అమరావతిని మళ్లీ అభివృద్ధి చేస్తున్నారని చూసి ప్రజలు ఆనందానికి అవధులు లేకుండా అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లన్నీ సభకు వచ్చిన వాహనాలతో బారులు తీరి సందడిగా మారాయి. ఈ వాతావరణం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది.
తొమ్మిదేళ్ల క్రితం అమరావతి రాజధాని అని ప్రకటించడంతో స్థానిక ప్రజలు ఉత్సాహంతో ముందుకు సాగారు. కానీ తర్వాత రాజకీయ పరిణామాలతో వారి ఆశలు తారుమారయ్యాయి. అయిదేళ్ల పాటు వారి జీవితం సందిగ్ధంలో గడిచింది. అనేక పోరాటాల తర్వాత ఇప్పుడు మళ్లీ అమరావతికి జీవం పోసే అవకాశం వచ్చింది. ఈ పునఃప్రారంభంతో వారి ముఖాల్లో ఆనందం తొణికిసలాడుతుంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రజల ఆశలకు తిరిగి వెలుగు చూపిన పండుగ.