Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
- By Kavya Krishna Published Date - 07:18 PM, Sun - 31 March 24
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు. బాబాయిని చంపే వాళ్లు, కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లులో డబ్బులు పంపే వాళ్లు మీకు కావాలా అని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల నాయకులు కలిసి తొక్కుకుంటూ ముందుకు వెళ్దామని, 43 నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్య మంత్రి ని చూడలేదన్నారు చంద్రబాబు. పార్లమెంట్ లో ముస్లీం బిల్లులు తీసుకువస్తే జగన్ సపోర్టు చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని, అబ్దుల్ సలాంని వేధించడంతో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు చంద్రబాబు. ఉర్థుని రెండో భాషగా మార్చింది నేనే అని, హైదరాబాద్, కర్నూల్ లో ఉర్థూ యూనివర్సీలు పెట్టానని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా…మార్కాపురంలో నేనే సవాల్ విసురు తున్నాను…జగన్ సమాధానం చెప్పాలని, ప్రజలు గెలవాలంటే కూటమి గెలవాలన్నారు చంద్రబాబు. ఈ రోజు మనం రాతియుగంలో ఉన్నామని, నా ప్రయాణం స్వర్ణయుగం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేనే ఒక డ్రైవర్ గా పని చేస్తాను.. మా బస్సులో ఎక్కిన వాళ్లు సురక్షితంగా గమ్యం చేరుతారని, గతంలో నా పాలన… ఇప్పడు జగన్ పాలన చూశారు.మనకి కావాల్సింది మతం, కులం, ప్రాంతం కాదు. మన కులం అని ఓటేస్తే కరెంట్ ఛార్జీలు పెంచకుండా మానేశాడు. మన మతం వాడని ఓటేస్తే లిక్కర్ రేటు తగ్గించాడా. మన ప్రాంతం వాడని ఓటేస్తే నిత్యావసర వస్తువల ధరలు తగ్గించాడా.. హైదరాబాద్ ని తెలుగు జాతి కోసం అభివృద్ది చేశా. హైటెక్ సిటీ, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారని అడిగితే నా పేరు చెబుతారు. జగన్ బటన్ నొక్కే కొద్ది ప్రజలకు కష్టాలు పెరుగుతుంటాయి.
తాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ ప్రభుత్వం ప్రజల్ని ఉద్దరిస్తుందా.. రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Srinivasulu Reddy)కి…మరో బటన్ కందుల నారాయణరెడ్డి (Kandula Narayana Reddy)కి నొక్కండి. మాగుంట అఖండ మెజారిటీతో గెలవాలి. మాగుంటకి వైసీపీలో అన్యాయం జరిగింది… అగౌరవ పరిచి బయటకు వెళ్లేలా చేశారు. అటు వంటి మాగుంటపై తిరుపతి నుండి ఒక రెడ్ శ్యాండిల్ ఉడ్ స్మగ్లర్ ని తీసుకువచ్చారు. అతను మామూలు వ్యక్తి కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి ఎక్కడి నుండి వస్తున్నాయో ముఖ్య మంత్రిగా చేసిన నాకే అర్థం కాలేదు. రెడ్ శ్యాండిల్ అమ్ముకుంటే…రౌడీ ఇజం చేస్తే చెవిరెడ్డికి డబ్బులు వస్తున్నాయి. ఆయన మీదే పుష్ప అని ఒక సినిమా తీశారు..ఇప్పుడు పుష్పా 2 తీస్తున్నారు. ఆ పుష్పా ఇక్కడి వచ్చాడు…ఆ పుష్పాకి ఓటు వేస్తారా.’ అని చంద్రబాబు అన్నారు.
Read Also : Narendra Modi : అవినీతిపరులపై చర్యలు ఆగవు
Related News
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.