HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbn Pawan Met Cec

CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు

  • Author : Sudheer Date : 09-01-2024 - 1:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Pawan Met Cec
Cbn Pawan Met Cec

కేంద్ర ఎన్నికల కమిషన్‌ రెండు రోజల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్‌ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు.

విజయవాడ నవోటెల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా అధినేతలు తమ ఫిర్యాదులను , అభిప్రాయాలని సీఈవో తో పంచుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సీఈవో తో సమావేశమై వైసీపీ ఫై పిర్యాదులు చేసారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యహరిస్తుందని, ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే పెద్దయెత్తున ఓట్లు గల్లంతయ్యాయని, దొంగఓట్లు నమోదు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాబు తెలిపారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని, ఆరు నుంచి ఏడు వేల మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. అలాగే ఇక్కడ కూడా జరగాలని కోరారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత రెండు నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారులను మార్చుతున్నారు. ఎన్నికల సమయానికి వారికి నచ్చిన పోలీసు అధికారులను కోరుకున్న చోట నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సీఈసీకి గట్టిగా తెలియజేశాం అని పవన్ తెలిపారు. ఇక, వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ అని, వారిని ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని ప్రత్యేకంగా విన్నవించాం. ఎన్నికల సంఘం గనుక చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని, హింస పెరిగిపోతుందని చెప్పాం. స్థానిక ఎన్నికల్లో ఒక దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపాం.

మేం చెప్పింది ఎన్నికల సంఘం సావధానంగా విన్నది. ఎన్నికల ప్రధాన అధికారి ఒకటే చెప్పారు… మేం పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం అని భరోసా ఇచ్చినట్లు పవన్ తెలిపాడు.

Read Also : KTR: అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP elections
  • CEC
  • chandrababu
  • Pawan Kalyan

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd