HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbn Govt Distribution Of 3 Cent House Plots To The Poor People

AP Government : ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు

  • Author : Sudheer Date : 29-07-2024 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Good News
Cbn Good News

అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను సంతోష పెడుతుంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ (YCP) పాలనా లో విసుగు చెందిన ప్రజలు..ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) పాలనలో సంబరాలు చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..రాష్ట్ర అభివృద్ధి ఫై బాబు ఫోకస్ పెట్టాడు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేసింది. అయితే లే అవుట్లు వేయని చోట కూడా ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు అందజేయాలని సీఎం నిర్ణయించారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సెంటు స్థలం పంపిణీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించింది. అయితే సెంటు స్థలంలో ఇళ్లు అగ్గిపెట్టెల్లా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు కనీసం రెండు సెంట్ల స్థలం అయినా పంపిణీ చేయాలని అప్పట్లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు అడుగులు వేస్తోంది. అలాగే ఆగస్ట్ రెండో తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాకులో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం చర్చించనుంది.

Read Also : Telangana Panchayat Elections : 33 జిల్లాల కలెక్టర్లకు CS కీలక ఆదేశం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 Cent House Plots Poor People
  • ap govt
  • chandrababu

Related News

Ap Govt Good News

Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.

    Latest News

    • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

    • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

    • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

    • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

    • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd