APSRTC : తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు.. బస్సులో 30మంది ప్రయాణికులు..!!
- By hashtagu Published Date - 10:47 AM, Thu - 24 November 22
అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. రొద్దం మండలంలో ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలా చేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వైర్లు వాహనాలకు ప్రమాదంగా మారాయి.
ఇప్పటికే పలు వాహనాలపై ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో తాడిపర్రి మండల కేంద్రంలో ఆటోపై హైటెన్షన్ వైర్లు పడి ఆటోలోని 5గురు కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఉడుత కారణంగా ఈ వైర్లు తెగి పడినట్లు విద్యుత్ అధికారులు నిర్దారించారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుపై వైర్లు తెగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించకపోయినట్లయితే…తమ ప్రాణాలు గాల్లో కలిసేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Related News
CM Revanth: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట: సీఎం రేవంత్
CM Revanth: అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లడుతూ ఆర్టీసీ బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తున్నది. ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలందరిది. ఆర్టీసీకి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నాన్చుడు