HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Behind Pawans Strategy Is Glass Symbol If There Is No Alliance No More Janasena

Glass Symbol : ప‌వ‌న్ వ్యూహం వెనుక `గ్లాస్‌` గ‌ల్లంతు! పొత్తు లేక‌పోతే అంతే..!

ప‌వ‌న్ (Glass symbol) వ్యూహం ఏమిటి? ఓటు చీలిక లోగుట్టు ఏమిటి? బీజేపీ రోడ్ మ్యాప్ అయిందా?

  • Author : CS Rao Date : 20-12-2022 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp-Janasena
Janasena,tdp

జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యూహం ఏమిటి? ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక లోగుట్టు ఏమిటి? బీజేపీ రోడ్ మ్యాప్ బుట్ట‌దాఖ‌లు అయిందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం ఒక‌టే. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీని బ‌తికించుకోవాలి. ఆ దిశ‌గా చాలా కాలంగా ప‌వ‌న్ త‌ప‌న ప‌డుతున్నారు. గుర్తింపులేని `గ్లాస్`(Glass Symbol) పార్టీ ఈసారి ఎన్నిక‌ల‌తో గ‌ల్లంతు అవుతుంద‌న్న టెన్ష‌న్ స‌హ‌జంగా ఉంటుంది. అందుకే, టీడీపీతో పొత్తు(Alliance) పెట్టుకోవ‌డ‌మే ప‌వ‌న్ అంతిమ వ్యూహం అంటూ ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట‌. ఆ విష‌యాన్ని వైసీపీ లీడ‌ర్లు కూడా ప‌దేప‌దే చెబుతున్నారు.

`గ్లాస్`(Glass Symbol) గుర్తును

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కంటే జ‌న‌సేన‌కు పొత్తు(Alliance) అవ‌స‌రం. బీజేపీతో మాత్ర‌మే క‌లిసి వెళితే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ఫ‌లితం ఉంటుంద‌ని జ‌న‌సేన‌లోని మోజార్టీ అభిప్రాయం. 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా గుర్తింపుకు స‌రిప‌డా ఓట్లు రావని ఆ పార్టీకి ఉన్న బెంగ‌. అదే జ‌రిగితే, `గ్లాస్`(Glass Symbol) గుర్తును శాశ్వ‌తం మ‌రిచిపోవాల్సిందే. ఎందుకంటే, ఇప్ప‌టికే ఆ `గ్లాస్` గుర్తును బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రుల‌కు కేటాయించారు. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఆ గుర్తు ఇస్తార‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి న‌డుస్తున్నందున అవ‌కాశం ఉంటుంద‌ని కొంద‌రి అభిప్రాయం. వాస్త‌వంగా ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం `గ్లాస్`(Glass Symbol) గుర్తును జ‌న‌సేన‌కు ఇవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే, పార్టీ పెట్టిన త‌రువాత 2014, 2019 ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి గుర్తింపు వ‌చ్చేంత ఓట్ల శాతాన్ని రాబ‌ట్ట‌లేపోయింది.

జ‌న‌సేన‌కు పొత్తు(Alliance)

రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే క‌నీసం 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోవ‌చ్చ‌ని ఆ పార్టీ వ్యూహం. ఆ వ్యూహాన్ని త‌న‌కు వ‌దిలేయ‌మ‌ని ప‌వ‌న్ చెబుతూ వ్య‌తిరేక ఓటును చీలిపోకుండా చూడాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం బీజేపీతో జ‌న‌సేన క‌లిసి న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎనిమిదో ఆవిర్భావ పార్టీ స‌భ‌లో నాలుగు ఆప్ష‌న్ల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. మ‌రో నెల రోజుల త‌రువాత `అధికారం మ‌న‌దే` అంటూ కాబోయే సీఎంగా ఫోక‌స్ అయ్యారు. దీంతో టీడీపీ చాలా వ‌ర‌కు పొత్తుకు సైడ్ అయింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ప‌వ‌న్ తాజాగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక‌పోకుండా వ్యూహం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ప‌వ‌న్ కౌలు రైతులకు స‌హాయం అందించ‌డానికి వెళుతున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం అందిస్తున్నారు. అంత వ‌ర‌కు ప‌వ‌న్ ను అభినందించాల్సిందే. అయితే, చ‌నిపోయిన‌ కుటుంబ య‌జ‌మాని ఫోటోను మ‌హిళల చేతుల్లో ప్ర‌ద‌ర్శిస్తూ వేదిక క‌నిపిస్తోంది. ఆ వేదిక మీద నుంచి రైతుల సమ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు పొత్తుల గురించి లీకులు ఇస్తున్నారు.

చ‌నిపోయిన భ‌ర్త ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ

రాష్ట్రంలోని రైతు స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. చ‌నిపోయిన భ‌ర్త ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్న మ‌హిళల‌ మ‌ధ్య‌న ప‌వ‌న్ చేస్తోన్న పొలిటిక‌ల్ స్పీచ్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. గ‌త రెండేళ్లుగా టీడీపీతో పొత్తు అనే అంశం మీద జ‌న‌సేన పార్టీని ప్ర‌జాక్షేత్రంలో లైవ్ లో ఉంచుతున్నారు. ఇదే ప‌వ‌న్ పెద్ద వ్యూహం. హైద‌రాబాద్ నుంచి నెల‌కో , రెండు నెల‌ల‌కో ఒక‌సారి ఏపీకి విజిట్ చేసే ప‌వ‌న్ ను చూడ్డానికి జ‌నం వ‌స్తున్నారు. వాళ్ల‌ను చూసి రాజ్యాధికారం మ‌నదే అంటూ ఒక రోజు, వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌ని మ‌రో రోజు, ఆప్ష‌న్లు అంటూ ఇంకో రోజు ఇలా రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు.

ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ కు చెరో రెండేళ్లు సీఎం ప‌ద‌వి అనే ప్ర‌తిపాద‌న జ‌నసేన‌లోని కొంద‌రు మీడియా వ‌ర‌కు తీసుకొచ్చారు. వాళ్ల వాల‌కాన్ని గ‌మ‌నించిన టీడీపీ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తూ ప్ర‌జాక్షేత్నాన్ని న‌మ్ముకుంది. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు ఎక్క‌డ స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. ఆ జ‌న‌సందేహాన్ని గ‌మ‌నించిన జ‌న‌సేనాని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలకుండా చేయ‌డ‌మే ల‌క్ష్యం అంటూ చెబుతున్నారు. అంటే, టీడీపీకి ప‌డే ఓట్లు చీలిపోకుండా క‌లిసి పోదామ‌ని ప‌రోక్ష సంకేతం.

స‌ర్వేల సారాంశం

ఒక వేళ జ‌న‌సేన‌, బీజేపీ పోటీ చేస్తే ఏ విధంగా టీడీపీకి న‌ష్ట‌మో శాస్త్రీయంగా ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల నాటికి(2019) చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారు. ఆయ‌న ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ఉండే ఓట‌ర్లు 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు పోవాలి. కానీ, వైసీపీకి వెళ్ల‌డంతో 151 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. క‌మ్యూనిస్ట్ లు, బీస్పీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తే వ‌చ్చిన ఓట్లు సుమారు 5శాతం. ఆ ఓట్ల‌కు అద‌నంగా ఎంత ప‌డినా 7శాతానికి జ‌న‌సేన‌, బీజేపీ ఓటు బ్యాంకు పెర‌గ‌దని స‌ర్వేల సారాంశం. గ‌త ఎన్నిక‌ల కంటే ఇంకా త‌గ్గే అవ‌కాశం కూడా లేక‌పోలేదని కొన్ని స‌ర్వేల అంచ‌నా. అంటే, టీడీపీ అవ‌స‌రం జ‌న‌సేన‌కు ఉంది.

జ‌న‌సేన అవ‌స‌రం టీడీపీకి పెద్ద‌గా ఉండ‌దు. ఒకవేళ‌ పొత్తు ఉంటే కొంత లాభ‌మ‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్న‌ప్ప‌టికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయ‌ని విశ్లేషించే వాళ్లు లేక‌పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవ‌లం పార్టీ గుర్తింపు కోసం ప‌వ‌న్ వ్యూహాన్ని ర‌చించుకుంటున్నార‌ని అనుకోవ‌డం స‌హ‌జం. అంతే వ్యూహాత్మ‌కంగా టీడీపీ కూడా అడుగులు వేస్తోంది. ప‌వ‌న్ తో పెట్టుకుంటే మునుగుతామో, తేల‌తామో తెలియ‌ని సందిగ్ధ‌త క్షేత్ర‌స్థాయిలోని సామాజిక ఈక్వేష‌న్ క‌నిపిస్తోంది. సో, ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? అనేది చూడాలి.

Also Read : Janasena: జనసేనాని హ‌త్య కుట్ర తూచ్‌! తేల్చేసిన పోలీస్!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh TDP
  • glass
  • Janasena
  • Pawan Kalyan

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

    Latest News

    • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd