Balakrishna : జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు జగన్ – బాలకృష్ణ
జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు
- Author : Sudheer
Date : 14-04-2024 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల ప్రచారం (AP Election Campaign) హోరెత్తిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు , ప్రతి సవాళ్లు మాత్రమే కాదు రాళ్ల దాడులు కూడా జరుగుతున్నాయి. నిన్న జగన్ (Jagan) ఫై రాళ్ల దాడి (Stone Attack) జరిగితే..ఈరోజు చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై రాళ్లు విసిరారు. ఆ రాళ్లు వారికీ తగలేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటె..హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన ప్రచారంలో జగన్ ఫై నిప్పులు చెరిగారు. జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు అంటూ ఓ రేంజ్ లో ఆరోపణలు సంధించారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతపురంలోని కుల్లూరులో బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అండగా ఉంటానని చెప్తూనే మరో వైపు దళితులను హత్యా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలను జగన్ రద్దు చేసి వాళ్లకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అలానే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం తథ్యం అని జోస్యం తెలిపారు.
Read Also : Pawan Kalyan : టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్..