B.Ed Question Paper Leak : బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్
B.Ed Question Paper Leak : పోలీస్ దర్యాప్తులో ప్రశ్నాపత్రం లీక్ కు ఒడిశాకు చెందిన ఏజెంట్లు (Agents from Odisha) ప్రధానంగా పాల్పడినట్టు గుర్తించారు
- Author : Sudheer
Date : 08-03-2025 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) లో బీఎడ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (B.Ed Question Paper Leak) కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర దర్యాప్తు చేపట్టగా, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇది విద్యా వ్యవస్థపై ప్రభావం చూపించే ఘటనగా విద్యార్థుల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పోలీస్ దర్యాప్తులో ప్రశ్నాపత్రం లీక్ కు ఒడిశాకు చెందిన ఏజెంట్లు (Agents from Odisha) ప్రధానంగా పాల్పడినట్టు గుర్తించారు. వీరు ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తూ, వారిని పరీక్షల్లో పాస్ చేయించేందుకు గోప్యమైన ప్రశ్నాపత్రాలను ముందుగానే లీక్ చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
Women’s day : మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకుంటే లాభాలే.. లాభాలు
ఈ ముఠా గత కొంతకాలంగా ఈ విధంగా అనేక విద్యార్థులకు సహాయపడుతూ, అక్రమ రీతిలో పరీక్షలను ప్రభావితం చేస్తోంది. ఈ ఘటనతో పరీక్షల ప్రామాణికత, నైతిక విలువలు ప్రశ్నార్థకమయ్యాయి. నమ్మకంగా చదువుకుని పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది న్యాయమా? అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యా వ్యవస్థలో నైతికతను దెబ్బతీసే ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇందులో ఎంత మంది ప్రమేయం ఉందా? ముఠా ఎంతవరకు విస్తరించింది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షా విధానాన్ని మరింత సురక్షితంగా మార్చాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.