DSC – TET : డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లపై క్లారిటీ.. రెండేళ్లు ‘అప్రెంటిస్షిప్’
DSC - TET : 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడేది ఎప్పుడనే దానిపై క్లారిటీ వచ్చింది.
- By Pasha Published Date - 08:15 AM, Sat - 3 February 24
DSC – TET : 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడేది ఎప్పుడనే దానిపై క్లారిటీ వచ్చింది. తొలుత టెట్ నిర్వహించి, ఆ తర్వాతే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ డిసైడ్ అయ్యింది. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఇంకో వారం టైం పట్టొచ్చని తెలుస్తోంది. టెట్ నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. మొదట టెట్ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు(DSC – TET) కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా టెట్ పరీక్షల షెడ్యూలును అధికారులు ఖరారుచేయనున్నారు. ఒకవేళ దరఖాస్తులు భారీగా వస్తే.. పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే టెట్తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
రెండేళ్లపాటు గౌరవవేతనం
ఏపీలో డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయాలని జనవరి 31న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటినుంచి డీఎస్సీ రిక్రూట్మెంట్లో అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేయనున్నారు. రాత పరీక్షలో ఎంపికైన టీచర్లు రెండేళ్లపాటు గౌరవవేతనం పొందుతూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత వారికి పూర్తిస్థాయి పే స్కేల్ అమల్లోకి వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
ఆ పోస్టులు డీఈడీ వారికే..
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(SA) పోస్టులకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది.
గత డీఎస్సీలో ఏం జరిగిందంటే ?
ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండగా 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 6.08 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తోంది.
Related News
12000 Jobs : ఇంజినీరింగ్ చేశారా ? ఎస్బీఐలో 12వేల జాబ్స్
12000 Jobs : మీరు ఇంజినీరింగ్ చేశారా ? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా ?