AP 10th Students : టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు జగన్ బంపర్ ఆఫర్
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించింది.
- By CS Rao Published Date - 02:00 PM, Fri - 24 June 22
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించింది. అంతేకాదు, రెగ్యూలర్ స్టూడెంట్స్ పాసైనట్టు సర్టిఫికేట్లను జారీ చేయడానికి సిద్దం అయింది. కొన్ని లక్షల మంది ఫెయిల్ అయిన విద్యార్థుల పక్షాన విపక్షాలు పోరాటం చేశాయి. ప్రభుత్వానికి చేతగానితనంగా ఆరోపణలు చేయడంతో తప్పుదిద్దుకునే దిశగా స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ఏపీ సర్కార్ ప్రకటించడం గమనార్హం.
ఫీజు మినహాయింపు ప్రయోజనం 2.01 లక్షల మంది ఫెయిల్ అయిన SSC విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. వారు తమ హాల్ టిక్కెట్ల గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. విద్యార్థులను ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు కంపార్టమెంటల్ పాస్ సర్టిఫికేట్కు బదులుగా రెగ్యులర్ పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ముఖ్యంగా, గ్రేస్ మార్కుల కోసం పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు మరియు ఇతర సంస్థల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. బదులుగా ఫీజు మినహాయింపు ప్రకటించింది.
SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ₹110 (3 సబ్జెక్టుల వరకు) మరియు ₹125 (3 కంటే ఎక్కువ సబ్జెక్టులు) పరీక్ష రుసుము చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినహాయిస్తున్నట్లు జీవో తో పాటు స్కూల్స్ కు సర్క్యులర్ జారీ చేసేలా సర్కార్ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 6 నుండి జూలై 15 వరకు నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా వారిని ప్రోత్సహించడానికి పలు వెసులబాటును సర్కార్ కల్పించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తామని, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్లో పేర్కొంది.
SSC బోర్డ్ పరీక్షకు హాజరైన 6,15,908 మంది విద్యార్థులలో 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్యూర్ శాతం 32.74 శాతంగా ఉంది. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిలవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం విదితమే. అందుకే బంపర్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రకటించింది.
Related News
Results: AP ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేయండిలా, వెబ్సైట్లు ఇవే..!
AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు (Results) విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AP ఇంటర్ ఫలితాలను ప్రకటించింది.