Vaccine: పిల్లల వ్యాక్సినేషన్ లో ‘ఏపీ’ అగ్రస్థానం
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్సుగల వారికి తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా
- By Balu J Published Date - 03:52 PM, Thu - 6 January 22
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్సుగల వారికి తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా కేవలం మూడు రోజుల్లోనే 52.82 శాతం టీకాలు వేసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. హిమాచల్ ప్రదేశ్ 49.2 శాతం, గుజరాత్ 45.29 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 33.44 శాతం, రాజస్థాన్లో 22 శాతం నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 76.09 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24.41 లక్షల మంది యువకులను గుర్తించామని, 15,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడు రోజులుగా కోవాక్సిన్ వ్యాక్సిన్ను అందజేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నుంచి సచివాలయాలతో పాటు విద్యాసంస్థల్లో ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయనున్నారు. శనివారం నాటికి టీనేజర్లందరికీ టీకాలు వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. జనవరి 3న దేశవ్యాప్తంగా టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం 147.72 కోట్ల డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసింది.
Related News
AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు